మద్యానికి బానిసై వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

మద్యానికి బానిసై వ్యక్తి మృతి

Jun 1 2025 12:48 AM | Updated on Jun 1 2025 12:48 AM

మద్యా

మద్యానికి బానిసై వ్యక్తి మృతి

టెక్కలి రూరల్‌: జిల్లా ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణలో శనివారం సాయంత్రం ఓ వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. అనంతరం టెక్కలి పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం పంచాయతీ శాలిపేట గ్రామానికి చెందిన చలపాక తారకేశ్వరరావు (39)గా గుర్తించినట్లు తెలిపారు. మద్యానికి బానిసై నిత్యం తాగుతూ ఉంటాడని, శరీరం డీ హైడ్రేషన్‌కు గురై మృతి చెంది ఉంటాడని పోలీసులు తెలిపారు.

కారు బోల్తా..

తప్పిన ప్రాణాపాయం

టెక్కలి రూరల్‌: కోటబొమ్మాళి మండలం శ్రీపురం సమీపంలో జాతీయ రహదారిపై శనివారం ఓ కారు బోల్తాపడింది. ఒడిశాకు చెందిన ఏడుగురు వ్యక్తులు దైవ దర్శనానికి విశాఖపట్నం వెళ్లి తిరిగి వస్తుండగా శ్రీపురం సమీపంలో అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

రూ.23,700 విలువైన

కలప స్వాధీనం

ఎచ్చెర్ల: ప్రాంతీయ నిఘా అమలు అధికారి బి. ప్రసాదరావు ఆదేశాల మేరకు లావేరు మండ లం బెజ్జిపురం జంక్షన్‌ వద్ద విజిలెన్స్‌, అటవీశా ఖ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. రణస్థలం మండలం చిల్లపేట గ్రామాని కి చెందిన సిల్లా శంకరరావు అటవీశాఖ అను మతులు లేకుండా బుడతవలస నుంచి చిల్లపేటకు అక్రమంగా తరలిస్తున్న రూ.23,700 విలువైన అకేషియా కలప దుంగలను పట్టుకున్నారు. అనంతరం బొలెరో వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా కలపను తరలిస్తు న్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటా మని అధికారులు తెలిపారు. ఈ తనీఖీల్లో విజిలెన్స్‌ అధికారులు సీఐ సతీష్‌కుమార్‌, ఎస్సై రామారావు, సిబ్బంది ఈశ్వరరావు, కన్నబా బు, అటవీశాఖ అధికారులు, డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ గౌరీశంకర్‌ పాల్గొన్నారు.

23 కేజీల గంజాయి సీజ్‌

నరసన్నపేట: మడపాం టోల్‌గేట్‌ వద్ద నిర్వహించిన తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల నుంచి 23 కేజీల 800 గ్రాముల గంజాయిని పోలీసులు సీజ్‌ చేశారు. ఈ ఘటనలో పర్లాకిమిడికి చెందిన ముక్తా పరిషా, కటక్‌కు చెందిన రత్నాకర్‌ జెన్నాలను అరెస్టు చేశారు. శనివారం నరసన్నపేట సర్కిల్‌ స్టేషన్‌లో అదనపు ఎస్‌పీ శ్రీనివాసరావు విలేకరులకు వివరాలు వెల్లడించారు. మడపాం టోల్‌గేట్‌ వద్ద శనివారం ఉదయం , మధ్యాహ్నం వేర్వేరుగా నరసన్నపేట పోలీసులు తనిఖీలు చేపట్టారు. ముక్తా పరిషా అనే మహిళ మూడేళ్ల బిడ్డతో 10 కేజీల గంజాయిని పర్లాకిమిడి నుంచి చైన్నెకి తరలిస్తుండగా పట్టుకున్నారు. ఆమెతో ఉన్న మరో వ్యక్తి పరారయ్యాడు. అలాగే కటక్‌ నుంచి హైదరాబాద్‌కు రత్నాకర్‌ అనే వ్యక్తి 13 కేజీల 800 గ్రాముల గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. రాజేష్‌ అనే వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ రెండు కేసుల్లో మరింత దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. సమావేశంలో నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు, ఎస్‌ఐ సీహెచ్‌ దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

హెల్మెట్‌ ధారణ తప్పనిసరి

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): ద్విచక్ర వాహనం నడిపే ప్రతిఒక్కరూ విధిగా హెల్మెట్‌ ధరించాలని ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి, ఎఫ్‌ఏసీ న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.శ్రీధర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం ట్రాఫిక్‌ నిబంధనలు, మోటారు యాక్ట్‌పై అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార కార్యదర్శి శ్రీధర్‌, ట్రాఫిక్‌ సీఐ వి.నాగరాజు, పారా లీగల్‌ వలంటీర్లు పాల్గొన్నారు.

నదిలో జారిపడి వృద్ధుడి మృతి

శ్రీకాకుళం రూరల్‌: బైరి గ్రామానికి చెందిన గొర్లె రామారావు(70) శనివారం సాయంత్రం ఆరుబయటకు వెళ్లి వంశధార నది వద్ద ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. ఎవరూ లేకపోవడంతో మునిగిపోయి చనిపోయాడు. విషయం తెలుసుకున్న రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కాలంలో నదిలో ఇసుక తవ్వకాలు ఎక్కువగా జరిగాయని, ఆ గోతులే ప్రాణాలు బలిగొంటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మద్యానికి బానిసై వ్యక్తి మృతి 1
1/2

మద్యానికి బానిసై వ్యక్తి మృతి

మద్యానికి బానిసై వ్యక్తి మృతి 2
2/2

మద్యానికి బానిసై వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement