
అక్రమ నిర్మాణంపై నోటీసులు
గార: మేజర్ పంచాయతీ శ్రీకూర్మంలో పాత బస్టాండ్ వద్ద పంచాయతీ స్థలంలో అక్రమంగా ఇంటి నిర్మాణం జరుగుతుండటంపై అధికారులు షోకాజ్ నోటీసు ఇచ్చారు. ‘దర్జాగా కబ్జా’ అనే శీర్షికన ఈ నెల 26న సాక్షిలో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. గ్రామకంఠంగా పిలవబడే సర్వే నెంబర్ 600లో ఈ నిర్మాణాలు జరుగుతుండటంపై శుక్రవారం ఈవోపీఆర్డీ కూర్మారావు, ఇన్చార్జి ఈవో శైలజలు పరిశీలించారు. నిర్మాణదారులు అందుబాటులో లేకపోవడంతో గోడలకు నోటీసులు అంటించారు. స్థలం డాక్యుమెంట్లు, పంచాయతీ, సుడా అనుమతుల వివరాలు ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.

అక్రమ నిర్మాణంపై నోటీసులు