
కొనసాగుతున్న నిర్వాసితుల దీక్ష
మెళియాపుట్టి: రేగులపాడు ఆఫ్షోర్ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న నిరాహార దీక్ష తొమ్మిదో రోజు కూడా కొనసాగింది. శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు గంగారపు సింహాచలం దీక్షలో పాల్గొని మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రాజెక్ట్ కోసం సొంతూరు, స్థలాలు, పొలాలు, ఇళ్లు సైతం త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయం చేయాలన్నారు. 132 మందికి ప్యాకేజీలు పెండింగ్ ఉన్నాయన్నారు. సోషల్ ఎకనామిక్లో లేని 40 కుటుంబాలకు వెంటనే సర్వే చేసి పరిహారాలు అందజేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. దీక్ష చేపట్టి తొమ్మిది రోజులు కావస్తున్నా అధికార యంత్రాంగం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉండటం బాధాకరమని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ యవ్వారి ఈశ్వరరావు, దొర విజయ్ కుమార్, కిరణ్, మాధవరావు తదితరులు ఉన్నారు.