శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ప్రపంచ పర్యావరణ దినోత్సవం – 2025 సందర్భంగా ఈ నెల 31 నుంచి జూన్ 5 వరకు ‘ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన, భవిష్యత్ తరాల సంరక్షణ, పుడమి సంరక్షణ’ అనే అంశంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ కాలు ష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజినీర్ కరుణశ్రీ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం 6 నుంచి 10వ తరగతుల విద్యార్థులకు శ్రీకాకు ళం న్యూ సెంట్రల్ స్కూల్ వేదికగా, ఇంటర్మీడియట్ విద్యార్థులకు జూన్ 4న శ్రీకాకుళం ప్రభు త్వ జూనియర్ కళాశాల (బాలురు), ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలికలు) వేదికగా వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. పచ్చదనం పరిరక్షణలో భాగంగా పైడిభీమవరం, టెక్కలి తదితర గ్రా మాల్లో 5000 మొక్కలు నాటనున్నట్లు పేర్కొ న్నారు. జూన్ 5న గ్రీన్ ర్యాలీ సమావేశాలను నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తామని తెలిపారు.
24 కేజీల గంజాయి స్వాధీనం
నరసన్నపేట: మడపాం టోల్గేట్ వద్ద శ్రీకాకుళం టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. ఒడిశా రాష్ట్రం గంజాం ప్రాంతం నుంచి విశాఖ వైపు అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా పోలీసులు నిఘా వేసి పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఓ మహిళ నుంచి 14 కేజీలు, ఇదే ప్రాంతానికి చెందిన రంజిత్ అనే మరో వ్యక్తి నుంచి 10 కేజీలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న గంజాయిని నరసన్నపేట పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది.
‘మద్యం విక్రయాలతో రూ.811 కోట్లు ఆదాయం’
శ్రీకాకుళం క్రైమ్ : మద్యం విక్రయాల్లో అక్రమాలకు తావులేకుండా ప్రతి నిత్యం నిఘా పెడుతున్నామని, బెల్టుషాపులు పెడితే కేసులు నమోదు చేస్తామని, నవోదయం 2.0లో భాగంగా సారారహిత జిల్లాగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ) పి.రామచంద్రరావు అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని 80 ఫీట్ రోడ్డు సమీపంలోని తన కార్యాలయంలో విలేకరులతో ఏసీ మాట్లాడారు.
సగటున రూ.110 కోట్లు నెలకు టార్గెట్గా పెట్టుకున్నామని, రూ.104 కోట్లతో రీచ్ అయ్యి అక్టోబరు నుంచి రూ.811 కోట్లు ఆదాయం సంపాదించామన్నారు. ఎన్ఫోర్స్మెంట్కు సంబంధించి 1537 కేసులు నమోదు చేసి 1462 మందిని అరెస్టు చేసి, 28 వాహనాలు సీజ్ చేశామన్నారు. సారాకు సంబంధించి 385 కేసుల్లో 270 మందిని అరెస్టు చేసి 4,133 లీటర్ల సారాయిని ధ్వంసం చేసి 15 వాహనాలు సీజ్ చేశామన్నారు. బెల్టుషాపుల వెనక లైసెన్సు దుకాణాదారులున్నారని బయటపడితే రూ. 5 లక్షలు అపరాధ రుసుం కట్టిస్తామన్నారు.
అనధికార పర్మిట్ రూమ్లు లేవని, మద్యం దుకాణాల వద్ద బహిరంగంగా మ ద్యం సేవించిన వారివల్ల న్యూసెన్సు జరుగుతోందని, అలాంటివారిపై 111 కేసులు నమోదు చేశామన్నారు. ఎమ్మార్పీకి మించి అమ్మిన దుకాణాలపై చర్యలు తీసుకుంటామని, బార్లు సమయపాలన పాటించాలని అన్నారు. ఫిబ్రవరి 19 తర్వాత 130 కేసుల్లో 270 లీటర్ల నాటుసారా స్వాధీనం, 25000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశామని, 114 మందికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించామన్నారు. గంజాయి కేసులు 3 నమోదు చేసి నలుగురిని అరెస్టు చేసి 40 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు.

రేపటి నుంచి పర్యావరణ వారోత్సవాలు