
అక్కులపేటలో పురాతన ఫ్యామిలీ ప్లానింగ్ సబ్ సెంటర్ భవనం
ఆమదాలవలస మండలంలోని అక్కులపేట గ్రామంలో 1973లో ఫ్యామిలీ ప్లానింగ్ సబ్ సెంటర్ ప్రారంభించారు. ఈ సెంటర్ సుదీర్ఘ కాలం సేవలు అందించింది. కొన్నేళ్ల కిందట అక్కుల పేట గ్రామంలో పీహెచ్సీ కట్టాక.. ఈ భవనాన్ని విడిచిపెట్టి పీహెచ్సీలోకి వైద్య సిబ్బంది వచ్చేశారు. అయితే ఈ భవనంపై ఆ గ్రామానికి చెందిన కొంతమంది టీడీపీ నాయకుల కన్ను పడినట్లు సమాచారం.
ఈ భవనాన్ని తొలగించి ఆ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ప్రైవేటు కల్యాణ మండపం నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆ గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు చెబుతున్నారు. ఈ ప్రక్రియకు ముహూర్తం కూడా పెట్టేశారు. దీన్ని ప్రభుత్వ రెవెన్యూ అధికారులు అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
– ఆమదాలవలస

భవనాన్ని నేలమట్టం చేసిన దృశ్యం