
● జపాన్లో జుగల్బందీ
శ్రీకాకుళం కల్చరల్ : సిక్కోలు కళాకారులు జపాన్లో అద్భుత ప్రదర్శనలు ఇస్తున్నారు. జిల్లా కేంద్రానికి చెందిన శివశ్రీ నృత్య కళానికేతన్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘుపాత్రుని శ్రీకాంత్ శిష్య బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున విదేశాలలో భారతీయ సంస్కృతి వైభవాలు చాటిచెప్పేలా మూడు రోజులుగా ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ సమగ్రతలో భాగంగా థాయిలాండ్ బృందంతో ప్రదర్శించిన జుగల్బందీ ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ బృందంలో నగరానికి చెందిన రామకౌండిన్య, నేహా, వర్ణిత, నేహా థామస్, లలిత, చాందిని ఉన్నారు.