
ఉద్యోగం నీకే..!
లక్షలిస్తే
అరసవల్లి:
‘మెడికల్ ఇన్వాలిడేషన్..’ జిల్లా వైద్యారోగ్య శాఖలో గత కొన్ని రోజులుగా నలుగుతున్న పేరు. వాస్తవానికి మెడికల్ ఇన్వాలిడేషన్ కోటా కింద అంటే ఒక ఉద్యోగి అనారోగ్య కారణాల రీత్యా పని చేయలేకపోతే అర్హతలు ఉన్న వారసులకు కొలువు లభిస్తుంది. కానీ జిల్లా వైద్యారోగ్య శాఖలో మాత్రం అర్హతలతో సంబంధం లేకుండా ‘ఆదాయం’ లెక్కలతో ఉద్యోగం ఇప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైద్యారోగ్య శాఖలో పనిచేసి అనారోగ్యానికి గురైన ఉద్యోగి తన వారసుడికి ఉద్యోగం ఇప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. విశేషం ఏమిటంటే ఆయన భార్య ఇదే శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. అయినా కూడా సర్వీస్ రిజిస్టర్లో భార్య పేరు మార్పు చేస్తూ ఉన్నతాధికారులను మేనేజ్ చేసి ఎలాగైనా ఉద్యోగం వారసునికి ఇప్పిస్తామంటూ ఓ కీలక ‘గ్యాంగ్’ ప్రయత్నాలు మొదలుపెట్టింది. రెండేళ్ల కిందటే ఈ అక్రమ వ్యవహారానికి శ్రీకారం చుట్టినప్పటికీ 2023లో నాటి కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ దీన్ని నిర్ద్వందంగా తోచిపుచ్చేశారు. ఇప్పుడు అదే ఫైల్ను రన్ చేసి ఎలాగైనా ఉద్యోగం వచ్చేలా చేసేందుకు జిల్లా వైద్యా రోగ్య శాఖకు చెందిన ఓ కీలక ఉద్యోగి రూ.5 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడన్న వార్త దావానంలా వ్యాపించింది.
జిల్లా వైద్యారోగ్య శాఖలో ఉద్యోగిగా పనిచేస్తూ అనారోగ్యానికి గురైన ఒక వ్యక్తి ఇంటికి వెళ్లి ఈ కీలక అధికారి పరామర్శించారు. ఇదే తడవుగా మెడికల్ ఇన్వాలిడేషన్ కోటా కింద మీ అబ్బాయికి ఉద్యోగం ఇప్పిస్తానంటూ చెప్పారు. రూ.5 లక్షలకు బేరం కూ డా కుదుర్చుకున్నాడు. అడ్మిన్ పరంగా ఎలాంటి అడ్డులేకుండా అక్రమంగా మెడికల్ ఇన్వాలిడేషన్ ఫైల్ను నడిపి తుది దశకు చేర్చాడు. అయితే ఇక్కడ నుంచే సీన్ మారిపోయింది. గత కలెక్టర్ ఇదే ఫైల్పై మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధమంటూ తిప్పిపంపించారనే అంశం బయటకు వచ్చింది. దీంతో స్థానిక వైద్యారోగ్య శాఖలో కొందరు ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులను ఆశ్రయించేందుకు అడుగు లు వేస్తున్నారు. డీఎంహెచ్ఓ స్థాయి అధికారి తొలిసారిగా ఏసీబీకి దొరికినా ఈ శాఖలో ఎలాంటి మార్పులు రావడం లేదని కొందరు తెలిపారు. ఈ అక్రమ పోస్టింగ్ ప్రక్రియపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు పంపించారు.
రూ.
నిబంధనలకు తూట్లు
ఎవరైనా ప్రభుత్వ శాఖ ఉద్యోగి మెడికల్గా అన్ఫిట్ అయితే ముందుగా ఆ పరిస్థితి నిజానిజాలపై అధికారులు ముందుగా మెడికల్ బోర్డుకు రిఫర్ చేస్తారు. అక్కడ ధ్రువీకరించిన తర్వాత మెడికల్లీ అన్ఫిట్ సర్టిఫికెట్ పొందాక.. ఈ సర్టిఫికేషన్ కింద వలంటరీ రిటైర్మెంట్ చేయాలని సదరు ఉద్యోగి శాఖ ఉన్నతాధికారికి విన్నవించువాల్సి ఉంటుంది. అనంతరం నియామకానికి సంబంధించి కమిటీకి కలెక్టర్ చైర్మన్, డీఎంహెచ్ఓ మెంబర్ కన్వీనర్గా ఉండగా అన్ని అర్హతలను పరిశీలించాక అర్హత ఉన్న వారసునికి ఉద్యోగం ఇవ్వాలి. అయితే తాజా వ్యవహారంలో నిబంధనలకు తూట్లు పడేలా వ్యవహారాన్ని సదరు కీలక అధికారి అన్నీ తానై నడిపించారు. ఇప్పటికే రూ.లక్షల్లో చేతులు మారిపోవడంతో ఉద్యోగం గ్యారంటీ అంటూ మళ్లీ అదనంగా డబ్బులు నొక్కేసేలా వ్యూహాలు అమలు చేస్తున్నట్లుగా సమాచారం.

ఉద్యోగం నీకే..!

ఉద్యోగం నీకే..!