
నలుగురిపై గృహ హింస కేసు నమోదు
ఎచ్చెర్ల క్యాంపస్: ముద్దాడ గ్రామానికి చెందిన అనిత ఫిర్యాదు మేరకు ఎచ్చెర్ల పోలీసులు మంగళవారం ఆమె భర్త ముత్యాలరావు, ముగ్గురు కుటుంబ సభ్యులపై గృహహింస కేసు నమోదు చేశారు. భార్యభర్తలు మధ్య ఇటీవల గొడవలు రావడం, భర్త అప్పులు చేయడం, కన్నవారి ఇంటి నుంచి డబ్బులు తీసుకు రావాలని ఒత్తిడి తీసుకురావడం వంటి కారణాలతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2019లో అనితకు వివాహం కాగా, కుమార్తె ఉంది. ప్రస్తుతం కన్నవారు ఇంటి వద్ద దుప్పలవలసలో ఉంటోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
108 అంబులెన్సులో ప్రసవం
మందస: మండలంలోని సింగుపురం గ్రామానికి చెందిన రాయవలస భారతి 108 అంబులెన్స్లో పండంటి బిడ్డకు మంగళవారం జన్మినిచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. భారతి పురిటి నొప్పులతో బాధపడుతుండగా వారి బంధువులు 108కు సమాచారం అందించారు. దీంతో మందస 108 సిబ్బంది ఈఎంటీ ఉప్పాడ గోపాలకృష్ణ, పైలట్ ఎస్.రాజేంద్ర ప్రసాద్లు గ్రామానికి హుటాహుటిన చేరుకున్నారు. అనంతరం ఆస్పత్రికి తీసుకొస్తుండగా మార్గమధ్యలో పురిటినొప్పులు ఎక్కువ అయ్యాయి. దీంతో ఆమెకు సిబ్బంది ప్రసవం చేయడంతో ఆడ శిశువుకి జన్మనిచ్చింది. అనంతరం హరిపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు.
పిడుగుపాటుకు మహిళ మృతి
కొత్తూరు: మండలంలోని దిగువ మల్లెలుగూడకు చెందిన యువతి సవర చిన్నారమ్మ (30) పిడుగుపాటుకు మృతి చెందినట్లు ఎస్ఐ ఎండీ అమీర్ ఆలీ మంగళవా రం తెలియజేశారు. చిన్నారమ్మ మేకలు కాపుకు వెళ్లగా సోమవారం సాయంత్రం పిడుగుపడి మృతి చెందినట్లు చెప్పారు. మృతురాలి తమ్ము డు సవర రాజారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పాతపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించామన్నారు.
కారు బోల్తా
రణస్థలం:మండలంలోని విశాఖపట్నం వైపు నుం చి శ్రీకాకుళం వైపు వెళ్తున్న కారు పైడిపేట జాతీ య రహదారిపై మంగళవారం బోల్తా పడింది. అయితే కారులో ఉన్నవారికి చిన్న,చిన్న గాయా లు కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వర్షం పడినప్పుడు జాతీయ రహదారిపై నీరు నిలబడిపోవడం వలన కారు బోల్తా పడిందని, తరుచూ ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు తెలిపారు. దీనిపై జేఆర్పురం పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు.

నలుగురిపై గృహ హింస కేసు నమోదు