పత్రికల గొంతు నొక్కే ప్రయత్నం సరికాదు | - | Sakshi
Sakshi News home page

పత్రికల గొంతు నొక్కే ప్రయత్నం సరికాదు

May 10 2025 2:12 PM | Updated on May 10 2025 2:12 PM

పత్రి

పత్రికల గొంతు నొక్కే ప్రయత్నం సరికాదు

‘సాక్షి’తో ఏఐటీయూసీ జిల్లా నాయకుడు టి.తిరుపతిరావు

శ్రీకాకుళం (పీఎన్‌

కాలనీ): ప్రజల తరఫున ప్రభుత్వాలను ప్రశ్నించే పత్రికల గొంతు నొక్కే ప్రయత్నాల ను పాలకులు మానుకోవాలని ఏఐటీయూసీ జిల్లా నాయకుడు టి.తిరుపతిరావు అన్నారు. సాక్షి ఎడిటర్‌ ధనంజయరెడ్డి నివాసంలో నిబంధనలకు విరుద్ధంగా సోదాలు నిర్వహించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడారు.

●సమాజంలో ప్రజలకు వాస్తవాలు తెలియజేసేవి పత్రికలే. అటువంటి వారి గొంతు నొక్కేయాలన్న ప్రయత్నం రాజకీయ పార్టీలు మానుకోవాలి. రాజ్యాంగంలో ఫోర్త్‌ఎస్టేట్‌గా భావించే నాలుగో స్తంభాన్ని విరగ్గొట్టాలని చూడటం పాలకులకు తగదు.

●ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛను హరించే రాజకీయ పార్టీలు, వ్యాపారవేత్తలు ప్రపంచ చరిత్రలో మనుగడలేకుండాపోయారు.

●కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు అమలుచే యడం మానేసి వాస్తవాల్ని తెలియజేసే పత్రికలు, మీడియాలపై పోలీసులతో కేసులు బనాయించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.

●కూటమి ప్రభుత్వం తీరును ప్రశ్నిస్తున్న సోషల్‌మీడియా వాదులపైనా కేసులు పెట్టడం దారుణం.

●ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని తరహాలు రెడ్‌బుక్‌ పేరిట కక్షసాధింపులు చర్యలు చేపడుతున్నారు. ఇటువంటివి తగ్గించుకుని ప్రజలకిచ్చే హామీలపై దృష్టి సారిస్తే మంచిది.

●పత్రికాస్వేచ్ఛను కాపాడితేనే ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది. లేదంటే కార్పొరేట్‌ శక్తులకు, రియల్టర్ల హవా కొనసాగి సామాన్యుడికి తిండిలేని దుస్థితికి ప్రభుత్వాలు తీసుకొస్తాయి.

ప్రజాస్వామ్యం బతికేదెలా..

ప్రభుత్వం

ఇలా

పత్రికల గొంతు నొక్కే ప్రయత్నం సరికాదు 1
1/1

పత్రికల గొంతు నొక్కే ప్రయత్నం సరికాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement