
మసీదులో గంధంచెట్లు నరికివేత
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని సూర్యమహాల్ కూడలి పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న జామియా మసీదులో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు గంధం చెట్లు నరికి తరలించే యత్నం చేశారు. ఈ విషయమై ఇప్పటికే వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్కు మసీదు మౌజన్ (గురువు) ఎస్.కె.మహ్మద్ ఫిర్యాదు చేసినట్లు మత పెద్దలు కె.ఎస్.అమానుల్లా, మరికొందరు చెప్పారు. మసీదులో సుమారు 40 వరకు చిన్నవి, పెద్దవి గంధం చెట్లున్నాయని, శుక్రవారం ఉదయం చెట్లను వాచ్మెన్ నాయుడు దగ్గరుండి ట్రిమ్మింగ్ చేసినట్లు తెలిసిందన్నారు. సాయంత్రం 4 గంటలకు 30 అడుగుల పొడవుండే ఒక గంధం చెట్టును గుర్తు తెలియని వ్యక్తులు తరలించేశారని అదే వాచ్మెన్ మౌజన్కు చెప్పడంతో ఆయన ఫిర్యాదు చేశారు. ఇంకా లోపల ఎన్ని చెట్లు కొట్టేశారో తెలియాల్సి ఉందన్నారు.
గంధం చెట్టు కొమ్మ