
యోగాతో మానసిక ఒత్తిడి దూరం
పెనుకొండ రూరల్: యోగాతో మానసిక ఒత్తిడి దూరమవుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. నిత్య జీవితంలో యోగా భాగం కావాలని సూచించారు. సోమవారం ఉదయం పెనుకొండ శివారులోని కియా పరిశ్రమ ఆవరణలో ఏర్పాటు చేసిన, యోగాంధ్ర కార్యక్రమంలో మంత్రితో పాటు కలెక్టర్ చేతన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ యోగాతో మానసికోల్లాసం, ఏకాగ్రత కలుగుతుందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని పిలుపునిచ్చారు. సీఈఓ కబ్డాంగ్ లీ, ఆర్డీఓ ఆనంద్ కుమార్, డీఆర్డీఏ పీడీ నరసయ్య, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు,కియా ఉద్యోగులు,విద్యార్థులు పాల్గొన్నారు.