
ఏపీఎంఎస్కు బస్సు ఏర్పాటు
పుట్టపర్తి అర్బన్: వివిధ గ్రామాల నుంచి పుట్టపర్తి మండలం జగరాజుపల్లిలోని ఏపీ మోడల్ స్కూల్ (ఏపీఎంఎస్)కు రాకపోకలు సాగించే విద్యార్థుల కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేశారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ‘ఇలా ఇంకెన్నాళ్లు?! ’ శీర్షికన మంగళవారం ‘సాక్షి’లో కథనం వెలువడింది. దీనిపై స్పందించిన ఆర్టీసీ అధికారులు వెంటనే బస్సు ఏర్పాటు చేశారు. రోజూ బడి వేళకు విద్యార్థులను పాఠశాలకు చేర్చడమే కాక, సాయంత్రం ఆయా గ్రామాలకు తీసుకెళ్లేలా ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. తమ కష్టాలను గుర్తించి, సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్న ‘సాక్షి’కి ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.
నేత్రదానంతో
మరో ఇద్దరికి చూపు
ధర్మవరం అర్బన్: స్థానిక శాంతినగర్కు చెందిన పామిశెట్టి రామకృష్ణ (70) అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న విశ్వదీప సేవా సంఘం వ్యవస్థాపకుడు కోళ్లమొరం చంద్రశేఖరరెడ్డి, సభ్యులు మృతుడి కుటుంబసభ్యులను కలసి నేత్రదానంతో మరో ఇద్దరికి చూపును ప్రసాదించవచ్చునని, అవగాహన కల్పించారు. దీంతో అంత బాధలోనూ రామకృష్ణ నేత్రాలను దానం చేసేందుకు కుటుంబసభ్యులు అంగీకరించారు. దీంతో మృతుడి నేత్రాలను జిల్లా అంధత్వ నివారణ సంస్థ, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ డాక్టర్ కుళ్లాయప్ప, కంటి రెట్రావైల్ సెంటర్ టెక్నీషియన్ రాఘవేంద్ర, ఆప్తాలమిక్ ఆఫీసర్ ఉరుకుందప్ప సేకరించారు. నేత్రదానానికి సహకరించిన మృతుని కుటుంబ సభ్యులు నాగమ్మ, సావిత్రి, సురేష్, రవి, కిరణ్, నాగరత్న, మంజుల, ఆదినారాయణ, మాధవకు విశ్వదీప సేవా సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
కిడ్నాప్ కేసు నమోదు
నల్లమాడ: అన్నాచెల్లెలును కిడ్నాప్ చేసిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు నల్లమాడ పోలీసులు మంగళవారం తెలిపారు. వివరాలు.. ప్రకాశం జిల్లా నల్లమడుగుల గ్రామానికి చెందిన గాయపు అంకమ్మ, ఏసురత్నం దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కట్టెలు కాల్చి బొగ్గుల చేసే పనిపై ఆధారపడి జీవనం సాగించేవారు. ఈ క్రమంలో అంకమ్మ తన కుటుంబసభ్యులతో కలసి సోదరుడు సమరం నగేష్ వెంట ఇటీవల నల్లమాడ మండలం దొన్నికోట గ్రామానికి వలస వచ్చి బొగ్గులు కాల్చే పనిని చేపట్టారు. ఈ నెల 22న రాత్రి ఒంటి గంట సమయంలో ఏసురత్నం ఇంట్లో లేని సమయంలో నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన బొగ్గుల వ్యాపారి (సేటు) ఎం.యంగయ్య, మరో నలుగురు వచ్చి అంకమ్మ, ఆమె సోదరుడు నగేష్ను బలవంతంగా కారులో ఎక్కించుకుని పోయారు. 23న వారి బారి నుంచి తప్పించుకుని ఇద్దరూ దొన్నికోటకు చేరుకున్నారు. అదే రోజు రాత్రి నల్లమాడ పోలీసులకు అంకమ్మ ఫిర్యాదు చేశారు. పాత బాకీ తీర్చాలంటూ తనను, తన సోదరుడిని యంగయ్య, మరో నలుగురు కిడ్నాప్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ అనంతరం మంగళవారం కిడ్నాప్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
మెట్లపై నుంచి జారిపడి
వ్యక్తి మృతి
బత్తలపల్లి: మేడపైకి వెళ్లేందుకు మెట్లు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తూ జారి కిందపడటంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. కడప జిల్లా వేంపల్లి మండలం అయ్యవారిపల్లికి చెందిన కోనేటి సుధాకర్ (38) బతుకుదెరువు నిమిత్తం 11 ఏళ్ల క్రితం బత్తలపల్లికి వచ్చాడు. ఆర్డీటీ ఆస్పత్రి సమీపంలో టిఫెన్ హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 20న రాత్రి మిద్దైపె పడుకునేందుకు మెట్లు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారడంతో కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయం కావడంతో భార్యతోపాటు స్థానికులు వెంటనే ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం.. అటు నుంచి కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. భార్య శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.సుధాకర్కు భార్య, కుమార్తె అద్వైత, తల్లి ఉన్నారు.
బాల పురస్కారాలకు
దరఖాస్తుల స్వీకరణ
పుట్టపర్తి అర్బన్: ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ – 2026’కి గాను అర్హులైన బాలల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీదేవి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. క్రీడలు, శౌర్యం, సామాజిక సేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, కళలు, సంస్కృతి తదితర రంగాలలో విశేష ప్రతిభ కనబరిచిన బాలలకు అవార్డులను అందజేయనున్నారు. ఆసక్తి ఉన్న వారు జూలై 31వ తేదీ లోపు https://awards.gov.in/ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఏపీఎంఎస్కు బస్సు ఏర్పాటు

ఏపీఎంఎస్కు బస్సు ఏర్పాటు

ఏపీఎంఎస్కు బస్సు ఏర్పాటు

ఏపీఎంఎస్కు బస్సు ఏర్పాటు