
బాబురెడ్డి కుటుంబసభ్యులకు వైఎస్ జగన్ పరామర్శ
సోమందేపల్లి: నియోజకవర్గ వైఎస్సార్సీపీ మాజీ సమన్వయకర్త చల్లాపల్లి బాబురెడ్డి శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదివారం సాయంత్రం బాబు రెడ్డి సతీమణి ఉమాను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్ ద్వారా పరామర్శించారు. ఽధైర్యంగా ఉండాలని, అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.
వైద్య కళాశాల ప్రిన్సిపాల్గా డాక్టర్ సత్యనారాయణ
అనంతపురం మెడికల్: ప్రభుత్వ వైద్య కళాశాల నూతన ప్రిన్సిపాల్గా డాక్టర్ కేవీవీ సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు జీఎంసీలోని న్యూరో సర్జరీ విభాగాధిపతిగా ఉన్న ఆయనను తాత్కాలిక అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్గా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. అలాగే అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ కింద ఇక్కడ పని చేస్తున్న ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్యరావును ఒంగోలు ప్రభుత్వ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్గా నియమించారు. ప్రభుత్వ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్గా ఉన్న డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వర రావును కడప జీజీహెచ్కు బదిలీ చేశారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్గా ఇంకా ఎవరినీ నియమించలేదు.
ప్రతి విద్యార్థికీ
మిత్ర కిట్లు అందించాలి
బత్తలపల్లి: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను ప్రతి విద్యార్థికీ అందేలా చొరవ తీసుకోవాలని ఉమ్మడి జిల్లా నోడల్ ఆఫీసర్, విద్యాశాఖ జేడీ సుబ్బారావు పేర్కొన్నారు.బత్తలపల్లిలోని ఎమ్మార్సీలో పంపిణీకి సిద్దంగా ఉన్న మిత్ర కిట్లను ఆదివారం ఆయన పరిశీలించారు. అందిన పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, బూట్లు, సాక్సులు, డిక్షనరీలు, బ్యాగులు, బెల్ట్ల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదన్నారు. నిర్ణీత సమయంలోపు కిట్ల పంపిణీ ప్రక్రియ పూర్తి కావాలని ఎంఈఓలను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఈఓ సుధాకర్నాయక్, ఎమ్మార్సీలు గోవిందరెడ్డి, వెంకటరమణ, సునీత, మంజుల, ఉపాధ్యాయ సంఘాల నాయకులు బుక్కచెర్ల రామకృష్ణారెడ్డి, నరసింహమూర్తి, షరీఫ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
రైళ్లలో తనిఖీలు
కదిరి టౌన్: స్థానిక రైల్వే స్టేషన్లో ఆదివారం ఉదయం జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది ముమ్మర తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల లగేజీ బ్యాగులను పరిశీలించారు. కదిరి రైల్వే ఎస్ఐ రహీమ్, సిబ్బంది పాల్గొన్నారు.
తన్నుకున్న ‘తమ్ముళ్లు’
గార్లదిన్నె: మండలంలోని కనుంపల్లికి చెందిన టీడీపీ కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పర దాడులతో రెచ్చిపోయారు. టీడీపీ కార్యకర్తలు ప్రసాద్, కుమార్, వెంకటలక్ష్మికి అదే పార్టీకి చెందిన రాము, సంతోష్, ఇందు, నల్లమ్మతో విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాత కక్షలను దృష్టిలో ఉంచుకుని ఆదివారం ఇరు వర్గాలు రాళ్లు, కట్టెలతో దాడులు చేసుకున్నారు. ఘటనలో గాయపడిన ఇరు వర్గాల వారినీ స్థానికులు 108 ద్వారా సర్వజనాస్పత్రికి తరలించారు. ఘటనపై ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
గంజాయి
తరలింపుదారుల అరెస్ట్
అనంతపురం సిటీ: రైలులో గంజాయి తరలిస్తూ అనంతపురం రైల్వే స్టేషన్లో ఇద్దరు యువకులు రైల్వే పోలీసులకు పట్టుబడ్డారు. జీఆర్పీ ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఆర్పీఎఫ్ ఎస్ఐ పవన్కుమార్రెడ్డి తెలిపిన మేరకు... అందిన సమాచారం మేరకు ఆదివారం ఉదయం అనంతపురం రైల్వే స్టేషన్లో జీఆర్పీ, ఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. భువనేశ్వర్ నుంచి వచ్చిన రైలులో అనంతపురంలో దిగిన ప్రయాణికుల బ్యాగ్లు పరిశీలించారు. సమయంలో రెండు బ్యాగ్లో 24 కిలోల గంజాయిని గుర్తించి, సంబంధీకులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం వారిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో రాప్తాడు మండలం సీపీఐ కాలనీ, కంబదూరు కొట్టాలకు చెందిన బిస్కట్ ఫయాజ్, బిస్కట్ మహబూబ్పీరా ఉన్నారు. వీరు భువనేశ్వర్ నుంచి గంజాయి తెచ్చి ఎక్కువ ధరకు అమ్మేవారని విచారణలో నిర్దారణ అయినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.1.20 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరు పరుస్తున్నట్లు ఎస్ఐలు పవన్కుమార్రెడ్డి, వెంకటేశ్వర్లు తెలిపారు.

బాబురెడ్డి కుటుంబసభ్యులకు వైఎస్ జగన్ పరామర్శ