
రేషన్ డీలర్ల ఇష్టారాజ్యం
చిలమత్తూరు: హిందూపురం పట్టణంలోని రేషన్ డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లుగా కార్డుదారులు ఆరోపిస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్లో నిలబడినా రేషన్ అందుకోవడం గగనంగా మారిందని 13వ వార్డు పరిధిలోని ఎస్.సడ్లపల్లి కార్డుదారులు వాపోయారు. ముందుగా తమ అనునూయులు, టీడీపీ వాళ్లకు తొలి ప్రాధాన్యతనిస్తూ వారికి రేషన్ అందించిన తర్వాతనే ఇతరుల కార్డులు తీసుకుంటున్నారని మండిపడ్డారు. అంతేకాక చక్కెరపై అదనంగా రూ.3 వసూలు చేస్తున్నారని వాపోయారు. విషయం తెలుసుకున్న వార్డు వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ కురుబ శ్రీనాథ్, సభ్యుడు హరిగోపాలరెడ్డి అక్కడకు చేరుకుని ప్రజలతో కలసి డీలర్ను నిలదీశారు. సడ్లపల్లిలోనే కాకుండా ముక్కిడిపేటలోని మూడు దుకాణాల్లోనూ ఇదే తంతు నడుస్తోందని మండిపడ్డారు. రేషన్ పంపిణీలో అవతవకలకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
జర్నలిస్టుల పిల్లలకు
ఉచిత విద్య అందించాలి
● ఏడీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో
కలెక్టర్కు వినతి
ప్రశాంతి నిలయం: జిల్లాలోని జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో 100 శాతం ఉచిత విద్య అందేలా ఆదేశించాలని కలెక్టర్ టీఎస్ చేతన్కు ఏపీయూడబ్ల్యూజే జిల్లా శాఖ ఆధ్వర్యంలో పాత్రికేయులు విన్నవించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లోని చాంబర్లో కలెక్టర్ను కలసి వినతి పత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్... డీఈఓ కిష్టప్ప ఫోన్ చేసి జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రేషన్ డీలర్ల ఇష్టారాజ్యం