
చాగల్లు రిజర్వాయర్లో అమ్మవారి విగ్రహం లభ్యం
పెద్దపప్పూరు: చాగల్లు రిజర్వాయర్లో అమ్మవారి పంచలోహ విగ్రహం లభ్యమైంది. పెద్దయక్కలూరు గ్రామానికి చెందిన కొందరు జాలర్లు ఆదివారం రాత్రి చేపల వేట కోసం చాగల్లు రిజర్వాయర్ దిగువ ప్రాంతంలో వలలు వేయగా 3 అడుగుల ఎత్తు దాదాపు 30 కిలోల బరువు ఉన్న పంచలోహపు అమ్మవారి విగ్రహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న పెద్దపప్పూరు గ్రామస్తులు అమ్మవారి విగ్రహాన్ని మేళతాళాలతో ఘనంగా ఊరేగించి చౌడేశ్వరిదేవి ఆలయంలో ఉంచారు.
కర్ణాటక వాసి దుర్మరణం
పెద్దవడుగూరు: మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై కాశేపల్లి టోల్ప్లాజా వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... కర్ణాటకలోని రాయచూర్ నుంచి పేపర్ బెడ్స్ లోడ్తో వచ్చిన ఐచర్ వాహనం అనంతపురంలో అన్లోడ్ చేసి సోమవారం తెల్లవారుజామున తిరుగు ప్రయాణమైంది. కాశేపల్లి టోల్ప్లాజా దాటగానే డ్రైవర్ ఖలీల్ నిద్ర మత్తులో జోగడంతో ముందు వెళ్తున్న గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొన్నాడు. ప్రమాదంలో రాయచూరు జిల్లా మాన్వికి చెందిన ఐచర్ క్లీనర్ మహమ్మద్ (31) అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుడి సోదరుడు యూనస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

చాగల్లు రిజర్వాయర్లో అమ్మవారి విగ్రహం లభ్యం