
రైల్లో నగలు చోరీ చేస్తూ పట్టుబడిన దొంగ
గుత్తి: రైలులో నగదు, నగలు చోరీ చేస్తూ ఓ దొంగ పట్టుపడ్డాడు. జీఆర్పీ పోలీసులు తెలిపిన మేరకు... శుక్రవారం మచిలీపట్నం – ధర్మవరం ఎక్స్ప్రెస్ రైలులోని కోచ్–1లో ప్రయాణిస్తున్న ఓ యువకుడు ఓ ప్రయాణకుడి బ్యాగ్లోని బంగారు నగలు, నగదు, సెల్ఫోన్లు అపహరిస్తుండగా గమనించి మరో ప్రయాణికుడు వెంటనే పోలీసు కంట్రోల్ రూమ్కు సమాచారం అందించాడు. రైలు గుత్తి రైల్వే స్టేషన్కు చేరుకోగానే జీఆర్పీ ఎస్ఐ నాగప్ప, హెడ్ కానిస్టేబుల్ నాగరాజు, సివిల్ కానిస్టుబుల్ భాస్కర్ నాయుడు కోచ్–1లోకి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి ఒకటిన్నర తులం బంగారు ఆభరణాలు, రూ.10 వేలు నగదు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన యువకుడు నంద్యాల జిల్లాకు చెందిన జయరాజ్గా గుర్తించి, పోలీస్ స్టేషన్కు తరలించారు. నిందితుడిని సమగ్ర విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రొళ్లలో చైన్ స్నాచింగ్
రొళ్ల: మహిళ దృష్టిని ఏమార్చి ఆమె మెడలోని బంగారు గొలుసును అపహరించుకెళ్లిన ఘటన రొళ్లలో సంచలనం రేకెత్తించింది. వివరాలు.. రొళ్లలోని మధూడి గ్రామానికి వెళ్లే మార్గంలో 544ఈ జాతీయ రహదారి పక్కనే బసవరాజు కుటుంబసభ్యులు నివాసముంటున్నారు. ఇంటి వద్దనే ఓ చిల్లరకొట్టు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. గురువారం రాత్రి 9.45 గంటలకు పాలు తీసుకొచ్చేందుకు బసవరాజు బయటకు వెళ్లడంతో అతని భార్య అనిత దుకాణంలో వ్యాపారం కొనసాగిస్తోంది. ఆ సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఓ యువకుడు సిగరెట్ కావాలని అడగడంతో అనిత తీసిచ్చి వెనుదిరిగే సమయంలో ఆమె మెడలోని 35 గ్రాముల బరువున్న బంగారం మాంగల్యం చైన్ను లాగాడు. అప్రమత్తమైన ఆమె చైన్ను పట్టుకోవడంతో పది గ్రాముల వరకు చైన్ తెగి చేతిలో ఉండిపోయింది. మిగిలిన 25 గ్రాముల చైన్తో యువకుడు బైక్పై ఉడాయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆరా తీశారు. ఆవినకుంట సమీపంలో సిమెంట్ ఇటుకల ఫ్యాక్టరీ వద్ద అమర్చిన సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

రైల్లో నగలు చోరీ చేస్తూ పట్టుబడిన దొంగ