అ‘పూర్వ’ సమ్మేళనం | - | Sakshi
Sakshi News home page

అ‘పూర్వ’ సమ్మేళనం

Dec 11 2023 12:26 AM | Updated on Dec 11 2023 12:26 AM

చిలమత్తూరు: మండల పరిధిలోని కోడూరు థామస్‌ మన్రో తోపులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 1998–99 బ్యాచ్‌ పదోతరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు పాఠశాల చదువుకునే రోజుల్లో తమకున్న జ్ఞాపకాలను నెమర వేసుకున్నారు. రోజంతా ఆట పాటలతో సరదాగా గడిపారు.

హిందూపురం టౌన్‌: స్థానిక శ్రీకంఠపురంలోని ఎస్‌కేయూపీ పాఠశాలలో 1983–84 బ్యాచ్‌కు చెందిన 7వ తరగతి విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. 40 ఏళ్ల తరువాత పాఠశాలలో దాదాపు 60 మంది పూర్వ విద్యార్థులు ఒకేచోట కలవడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆనాటి ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణరావుతో పాటు పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement