175 నియోజకవర్గాలకు స్కూటర్‌ యాత్ర | - | Sakshi
Sakshi News home page

175 నియోజకవర్గాలకు స్కూటర్‌ యాత్ర

Dec 22 2025 1:55 AM | Updated on Dec 22 2025 1:55 AM

175 నియోజకవర్గాలకు స్కూటర్‌ యాత్ర

175 నియోజకవర్గాలకు స్కూటర్‌ యాత్ర

నెల్లూరురూరల్‌: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని జలదంకి మండలం అన్నవరం గ్రామానికి చెందిన అడవికొట్టు రాజు 175 నియోజకవర్గాలకు స్కూటర్‌ యాత్రను ఆదివారం ప్రారంభించారు. ఈ మేరకు నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయం వద్ద మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి అంటే చాలా అభిమానం అని, పేదల కోసం ఆయన ఎంతో చేశారని, ఆ అభిమానంతో నేను స్కూటర్‌ యాత్ర చేస్తున్నానని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వల్ల తాను ఎంతో లబ్ధి పొందానని, అంతకన్నా ఎక్కువ పథకాలు జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు ఇచ్చారని తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement