కూలిన బ్రిడ్జి.. రాకపోకలకు అంతరాయం | - | Sakshi
Sakshi News home page

కూలిన బ్రిడ్జి.. రాకపోకలకు అంతరాయం

Dec 19 2025 7:47 AM | Updated on Dec 19 2025 7:47 AM

కూలిన బ్రిడ్జి.. రాకపోకలకు అంతరాయం

కూలిన బ్రిడ్జి.. రాకపోకలకు అంతరాయం

అనుమసముద్రంపేట: మండలంలోని కావలియడవల్లి వద్ద ఉన్న బ్రిడ్జి గురువారం కూలిపోయింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు మళ్లించినట్లు ఎస్సై సైదులు తెలిపారు. వివరాలు.. హసనాపురం నుంచి కలిగిరి వెళ్లే రహదారిలో కావలియడవల్లి వద్ద కాలువపై ఆర్‌అండ్‌బీకి చెందిన బ్రిడ్జి ఉంది. ఇది కూలడంతో కలిగిరి – పామూరుకు వెళ్లే వాహనాలను హసనాపురం, జమ్మవరం, గుంపర్లపాడు మీదుగా మళ్లించారు. బ్రిడ్జి కూలిపోయే అవకాశముందని తెలిసినా ఆర్‌అండ్‌బీ అధికారులు, కూటమి నేతలు పట్టించుకోలేదు. ఆ రహదారి గుంతలమయంగా మారడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు సైతం ప్రమాదాలకు గురయ్యారు. ఇప్పటికైనా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, అధికారులు స్పందించి వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కావలియడవల్లి, అక్బరాబాదు, హసనాపురం వాసులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement