సోషల్‌ ఆడిట్‌ సర్వేను పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

సోషల్‌ ఆడిట్‌ సర్వేను పూర్తి చేయాలి

Dec 19 2025 7:47 AM | Updated on Dec 19 2025 7:47 AM

సోషల్‌ ఆడిట్‌ సర్వేను పూర్తి చేయాలి

సోషల్‌ ఆడిట్‌ సర్వేను పూర్తి చేయాలి

నెల్లూరు(టౌన్‌): పాఠశాలల్లో మౌలిక వసతుల స్థితిగతులను తెలిపే సోషల్‌ ఆడిట్‌ సర్వేను రెండు రోజుల్లో పూర్తి చేయాలని డీఈఓ బాలాజీరావు ఆదేశించారు. నెల్లూరు దర్గామిట్టలోని సెయింట్‌ జోసఫ్‌ ఇంగ్లిష్‌ మీడియం హైస్కూల్లో జిల్లాలోని సీఆర్‌ఎంటీలకు గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతం – మౌలిక సదుపాయాల కల్పనకు సర్వే జరుగుతుందన్నారు. జిల్లా స్థాయి నుంచి పాఠశాల వరకు ఏ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాలన్నా సీఆర్‌ఎంటీల పాత్ర కీలకమన్నారు. సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ డోనర్‌ యాప్‌లో ఆయా పాఠశాలలకు ఏ వసతులు కావాలి, వాటిని సమకూర్చే విధంగా దాతల ఏర్పాటుకు సంసిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఏఎంఓ సుధీర్‌బాబు, సీఎంఓ రమణయ్య, డిప్యూటీ డీఈఓ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement