
నేటి నుంచి జాతీయస్థాయి సాఫ్ట్బాల్ టోర్నమెంట్
● వీఎస్యూకు చేరుకున్న క్రీడాకారులు
వెంకటాచలం: మండలంలోని కాకుటూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీ (వీఎస్యూ) వేదికగా జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ టోర్నమెంట్ బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. బుధవారం నుంచి మే 3వ తేదీ వరకు జరిగే పోటీల్లో 94 మహిళా టీంలు పాల్గొననున్నాయి. మే 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరిగే పోటీల్లో 97 పురుషుల టీంలు తలపడనున్నాయి. ఈ పోటీల నిర్వహణను వీఎస్యూ అధికారులు ప్రతిష్టాత్మంగా తీసుకుని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. మంగళవారం సాయంత్రానికి వివిధ రాష్ట్రాల నుంచి మహిళా క్రీడాకారులు వీఎస్యూకు చేరుకున్నారు. కాసేపు క్రీడా మైదానంలో ప్రాక్టీస్ చేశారు. బుధవారం ఉదయం 6.30 గంటలకు మొదటి మ్యాచ్లో తెలంగాణ యూనివర్సిటీ, స్వర్ణజిత్ గుజరాత్ స్పోర్ట్స్ యూనివర్సిటీ జట్లు తలపడనున్నాయి.