
మహిళ అనుమానాస్పద మృతి
పొదలకూరు: మండలంలోని తోడేరు రోడ్డు బస్షెల్టర్ వద్ద మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. హత్యా? లేక ప్రమాదవశాత్తు ఏదైనా వాహనం ఢీకొని గాయపడి మృతిచెందిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. నక్కా తిరుపాలు, లక్ష్మమ్మ (52) ఏడేళ్లుగా తోడేరు రోడ్డు బస్
షెల్టర్ను స్థావరంగా చేసుకుని జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు మగ పిల్లలు, ముగ్గురు ఆడపిల్లలున్నారు. మగపిల్లలు బుచ్చిరెడ్డిపాళెంలో ఉండగా, ఆడపిల్లలకు వివాహమైనట్లు తెలుస్తోంది. లక్ష్మమ్మ తలపై, శరీరంపై గాయాలై బస్షెల్టర్ వద్ద చనిపోయి ఉండటాన్ని స్థానికులు శుక్రవారం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పొదలకూరు సీఐ ఎ.శివరామకృష్ణారెడ్డి, ఎస్సై ఎస్కే హనీఫ్ ఘటనా స్థలానికి వెళ్లి ప్రాథమిక విచారణ నిర్వహించారు. అనుమానాస్పద మృతి కింద భర్తను అదుపులోకి తీసుకున్నారు. మెయిన్రోడ్డు పక్కనే బస్షె ల్టర్ ఉండటంతో గురువారం అర్ధరాత్రి లక్ష్మమ్మ రోడ్డు మీదకు వెళ్లడంతో గుర్తుతెలియని వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడి మృతిచెందిందా? లేక ఇంకేమైనా కారణాలున్నాయా? అని ఆరాతీస్తున్నా రు. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తలపై గాయాలు
పోలీసుల అదుపులో భర్త