Shreyas Iyer becomes highest run-scorer for India in 2022 - Sakshi
Sakshi News home page

IND vs BAN: శ్రేయస్‌ అయ్యర్‌ అరుదైన రికార్డు.. తొలి భారత ఆటగాడిగా

Dec 14 2022 4:30 PM | Updated on Dec 14 2022 4:51 PM

Shreyas Iyer becomes Most Runs in 2022 across formats - Sakshi

టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌ అరుదైన ఘనత సాధించాడు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్‌లు కలిపి అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా శ్రేయస్‌ అయ్యర్‌ నిలిచాడు. ఛాటోగ్రామ్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 21 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద అయ్యర్‌ ఈ రికార్డు సాధించాడు. 

ఇప్పటి వరకు ఈ ఏడాది ఈ ఏడాది అన్ని ఫార్మాట్‌ల్లో 36 ఇన్నింగ్స్‌లు ఆడి 1486 పరుగులు సాధించాడు.  కాగా ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 82 పరుగులతో అయ్యర్‌ ఇంకా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ఇక  అంతకుముందు ఈ రికార్డు భారత విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ పేరిట ఉండేది.

సూర్య ఈ ఏడాది అన్ని ఫార్మాట్‌ల్లో కలిపి 43 ఇన్నింగ్స్‌లలో 1424 పరుగులు సాధించాడు. తాజా మ్యాచ్‌తో సూర్య రికార్డును అయ్యర్ బ్రేక్‌ చేశాడు. సూర్య తర్వాతి స్థానంలో భారత వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌(1232) పరుగులతో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement