
రాజస్తాన్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ కుమార సంగక్కరతో సంజూ శాంసన్(PC: IPL)
IPL 2022 Auction- Sanju Samson: పర్సులో ఇంకా 62 కోట్లు.. అలాంటి వారినే ఎంచుకుంటాం: సంజూ శాంసన్
ఐపీఎల్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా వేలం మరికొన్ని గంటల్లో ఆరంభం కానుంది. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఆక్షన్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వేలానికి హాజరయ్యే క్రమంలో ఇప్పటికే ఆయా ఫ్రాంఛైజీల నుంచి కీలక వ్యక్తులు క్వారంటైన్లోకి వెళ్లినట్లు సమాచారం. వేలానికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాము ఆక్షన్లో ఎలాంటి వ్యూహం అనుసరించబోతున్నారో వివరించాడు.
‘‘ఈ వేలం ఎంతో ముఖ్యమైనది. రానున్న ఐదారేళ్లకు ఇప్పుడే పునాది వేయాలి. ప్రతి ఆటగాడి రికార్డు పరిశీలిస్తాం. వీలైనంత ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నాం. కనీసం ఐదేళ్లపాటు సేవలు అందించగలగాలి. మా ఆలోచనలకు.. అవసరాలకు తగ్గట్లుగా రాణించే ప్లేయర్లను ఎంపిక చేసుకోవడమే లక్ష్యం. మా జట్టు విలువలు కాపాడగలగాలి. టీమ్ను అత్యుత్తమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలి. అలాంటి వారి కోసం ఎదురుచూస్తున్నాం’’ అని సంజూ శాంసన్ అధికారిక ప్రకటనలో పేర్కొన్నాడు.
కాగా ఐపీఎల్-2021 సీజన్లోనూ రాజస్తాన్ రాయల్స్ పరాజయాల పరంపర కొనసాగింది. ఆడిన 14 మ్యాచ్లలో కేవలం ఐదింట మాత్రమే గెలుపొంది పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ఇక మెగా వేలం 2022 నేపథ్యంలో రాజస్తాన్ రాయల్స్.... కెప్టెన్ సంజు సామ్సన్ (రూ. 14 కోట్లు), జాస్ బట్లర్ (రూ. 10 కోట్లు), యశస్వి జైస్వాల్ (అన్క్యాప్డ్ – రూ. 4 కోట్లు)ను రిటైన్ చేసుకుంది. ఇందుకోసం 28 కోట్లు ఖర్చు కాగా.. పర్సులో ఇంకా 62 కోట్ల రూపాయలు ఉన్నాయి. 22 స్థానాలు మిగిలి ఉన్నాయి. విదేశీ ఆటగాళ్ల కోటాలో 7 స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
చదవండి: Ind Vs Wi 3rd ODI: ప్రయోగాలకు సిద్ధం.. అతడు కచ్చితంగా తుది జట్టులో ఉంటాడు: రోహిత్ శర్మ
100+ players. 4 days. 32 hours of data. All that goes into an @IPL trial. 👇#RoyalsFamily pic.twitter.com/i4bIkOJIBh
— Rajasthan Royals (@rajasthanroyals) February 10, 2022