
ఉత్తమ సేవలకు గుర్తింపు
సిద్దిపేటకమాన్/చేర్యాల: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ సేవా పతకాలను పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు అధికారులు పొందారు. సీసీఆర్బీ హెడ్ కానిస్టేబుల్ మహమ్మద్ మిస్బావుద్ద్దిన్, చేర్యాల సీఐ శ్రీను, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఏబీ దుర్గ, సిద్దిపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ రఘుకు సేవా పతకాలు దక్కాయి. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అనురాధ మాట్లాడుతూ పోలీస్ శాఖ లో అంకితభావంతో, నీతి నిజాయితీగా విధులు నిర్వహించే అధికారులకు, సిబ్బందికి తప్పకుండా గుర్తింపు దక్కుతుందని తెలిపారు. ఉత్తమ సేవా పతకాలు అందుకున్న అధికారులు మరింత ఉత్సాహంతో విధులు నిర్వహించి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
నలుగురు పోలీసులకు పతకాలు

ఉత్తమ సేవలకు గుర్తింపు

ఉత్తమ సేవలకు గుర్తింపు

ఉత్తమ సేవలకు గుర్తింపు