కరోనా పట్ల ఆందోళన వద్దు | - | Sakshi
Sakshi News home page

కరోనా పట్ల ఆందోళన వద్దు

May 28 2025 5:51 PM | Updated on May 28 2025 5:51 PM

కరోనా పట్ల ఆందోళన వద్దు

కరోనా పట్ల ఆందోళన వద్దు

ఆస్పత్రి సూపరింటెండెంట్‌ హేమరాజ్‌సింగ్‌

దుబ్బాక: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందవద్దని దుబ్బాక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ హేమరాజ్‌సింగ్‌ సూచించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పుడు వ్యాప్తి చెందుతున్న కరోనా లక్షణాలు గతంలో మాదిరిగానే ఉన్నా వ్యాధి ప్రభావం అంతగా లేదన్నారు. కోవిడ్‌ మహమ్మారి రాకుండా ప్రజలు ముందుజాగ్రత్తగా మాస్కులతో పాటు శానిటైజర్‌ ఉపయోగించాలని సూచించారు. లక్షణాలు ఉంటే ప్రజలు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి రావాలన్నారు. ప్రజలు ముందుగా భయం వీడి ధైర్యంగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement