
సేంద్రియ ఎరువుకే సై
చిన్నకోడూరు(సిద్దిపేట): గతంలో మాదిరిగా పంట ఎదుగుదలకు రసాయన ఎరువులకు బదులుగా పశువుల ఎరువులను వాడేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఎరువు వాడకం వల్ల ఆరోగ్యకరమైన పంటలు, భూసారినికి ఎలాంటి హాని ఉండదని ఎక్కువ పెట్టుబడి పెట్టి పశువుల ఎరువును పంట చేనులో చల్లుతున్నారు. పంటలకు రసాయనాలు, క్రిమి సంహారక మందులు మోతాదుకు మించి వాడొద్దంటూ వ్యవసాయ శాఖ అధికారులు చెబుతుండటంతో రైతులు ఈ ఎరువుల వాడకంపై దృష్టి పెట్టారు. చాలామంది పశువుల ఎరువును వాడడం మూలంగా ప్రస్తుతం దీని ధర ట్రాక్టర్ ట్రిప్పునకు రూ.13 వేలకు పైబడి పలుకుతుంది.
పశువుల ఎరువుతో లాభాలు
గతంలో వ్యవసాయ దారులు ప్రత్యేకంగా పశువుల పేడను ఒక చోట నిల్వ ఉంచేవారు. ఏడాది తరువాత ఆ పశువుల పేడ సేంద్రియ ఎరువుగా మారేది. దీన్నే పంట పొలాల్లో వేయడం వల్ల సత్ఫలితాలు సాధించేవారు. అన్ని నేలలకు పశువుల పేడా అనుకూలంగా ఉంటుంది. ఈ ఎరువు ద్వారా వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందుతుంది. నేలలో నీటి నిల్వ సామర్ాధ్యన్ని కూడా పెంచుతుంది. మొక్కలకు సూక్ష్మ పోషకాలు అందుబాటులో ఉండేలా ఈ ఎరువు ఎంతో ఉపయోగపడుతుంది. అయితే పశువుల ఎరువులను ఒక్కసారి వాడితే 2 నుంచి 3 పంటలకు భూసారం దెబ్బతినకుండా ఉంటుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అర్జించవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఆసక్తి చూపుతున్న రైతులు
ఖర్చు పెరిగినా ..
పంట దిగుబడి వస్తుందని ఆశ
ట్రాక్టర్ ట్రిప్పునకు రూ.13 వేలు
ఈ ఎరువుతో మేలు
రైతులు అందుబాటులో ఉంటే పశువుల ఎరువును ప్రతి ఒక్కరూ వాడవచ్చు. ఏ నేలకై నా ఈ ఎరువు ఎంతో లాభం. గతంలో ఈ ఎరువులనే వాడేవారు. ఈ ఎరువులతో పండించిన పంటల దిగుబడి పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో పశువుల ఎరువుతో ఎంతో మేలు జరుగుతుంది.
– జయంత్ కుమార్, ఏఓ