శుభకార్యాల్లో స్టీల్ వస్తువులే వాడండి
హుస్నాబాద్: మీ ఇంట్లో జరిగే శుభకార్యాల్లో ప్లాస్టిక్ వస్తువులు బదులు స్టీల్ వస్తువులను వాడాలని మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత అన్నారు. పట్టణంలోని రామాలయంలో గురువారం జీరోవేస్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రజిత మాట్లాడుతూ ప్రజలందరూ ఇప్పటి నుంచే తమఇంట్లో జరిగే శుభాకార్యాల్లో స్టీల్ వస్తువులు లేదా భూమిలో కుళ్లిపోయే స్వభావం ఉన్న వస్తువులను వాడి రాబోయే తరాలకు మార్గదర్శకులు కావాలన్నారు. అనంతరం పట్టణంలోని రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలకు వచ్చిన భక్తులకు ఎండిపోయిన ఆకులతో తయారు చేసిన గిన్నెల్లో ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్య, కౌన్సిలర్లు బోజు రమాదేవి, కోమటి స్వర్ణలత, పెరుక భాగ్యరెడ్డి, పున్నలావణ్య, చిత్తారి పద్మ, గోవిందు రవి, దొడ్డి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.