సంగారెడ్డి జోన్: ప్రజావాణిలో వచ్చిన అర్జీలు పెండింగ్లో ఉంచొద్దని కలెక్టర్ ప్రతీక్జైన్ అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కలెక్టరేట్ కార్యాలయంతోపాటు డివిజన్ స్థాయిలో మొత్తం 62 దరఖాస్తులు వచ్చినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తులు సంబంధిత అధికారులకు పంపించి పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలన్నారు. సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యం వహించరాదని అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంగీత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతీక్ జైన్


