జిన్నారం (పటాన్చెరు): గుమ్మడిదల పట్టణ పరిధిలోని దోమడుగు, బొంతపల్లి గ్రామాల్లో న్యూలాండ్ ఫౌండేషన్, నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ సహకారంతో సీఎస్ఆర్ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 8 గ్రామాల్లో రూ.10 లక్షల వ్యయంతో 14 బయోగ్యాస్ యూనిట్లు, రూ.6 లక్షల వ్యయంతో 16 వర్మీ కంపోస్ట్ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శ్రీనివాస్ రెడ్డి, రాజారెడ్డి, కృష్ణ, చక్రపాణి, కుమార్ గౌడ్, జైపాల్ రెడ్డి, నాయకులు మహేష్, శేఖర్ రెడ్డి, హుస్సేన్, న్యూలాండ్ ఫౌండేషన్ ప్రతినిధులు సిఎస్ఆర్ హెడ్ రవి, ప్రతాప్ సింగ్, హెచ్ఆర్ హెడ్ సూర్యభగవాన్ పాల్గొన్నారు.


