తరచూ ఇంట్లో గొడవలు జరిగే సమయాల్లో పిల్లలను తీసుకొని వెళ్లి రాత్రి 11లోపు ఇంటికి చేరుకునే వాడు. గురువారం ఉదయం 9.40గంటల ప్రాంతంలో పిల్లలను తీసుకొని వెళ్లి సాయంత్రం అయినా ఇంటికి చేరుకోలేదు. భార్య ఫోన్ చేస్తే స్పందించలేదు. నిజాంపేటకు వచ్చిన కృష్ణ.. బైక్ తీసుకొని నిజాంసాగర్కు చేరుకున్నాడు. పిల్లలకు ఆహారం కొనిచ్చి తినిపించాడు. కొద్దిసేపు నీటిలో ఆడించాడు. చేపలు పట్టేందుకు వాడే తెప్పపై పిల్లలను కూర్చోబెట్టుకొని నీరు ఎక్కువగా ఉండే ప్రాంతంలోకి వెళ్లి ఆడించి వారిని నీటిలో తోసేసి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


