ఆత్మీయం ఏదీ? | - | Sakshi
Sakshi News home page

ఆత్మీయం ఏదీ?

Jun 24 2025 7:38 AM | Updated on Jun 24 2025 7:38 AM

ఆత్మీయం ఏదీ?

ఆత్మీయం ఏదీ?

రైతు కూలీలపై
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందని ద్రాక్షేనా?

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం రైతు కూలీలు ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా రైతు కూలీలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ కింద ఏడాదికి రూ.12వేల చొప్పున ఇస్తామని ప్రకటించింది. పథకాన్ని ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా 70గ్రామాల్లో ప్రారంభించి దాదాపు ఐదు నెలలవుతున్నప్పటికీ ఇంకా అన్ని గ్రామాల్లో అమలు చేయడం లేదు. లబ్ధిదారులు ఎంపికై నప్పటికీ ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

– సాక్షి, సిద్దిపేట

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం లబ్ధిదారులకు అందని ద్రాక్షగానే మారింది. భూమిలేని ఉపాధి హామీ కూలీలకు రైతు భరోసా కింద ఏటా రూ.12వేల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండు విడతల్లో సాయం అందించనుంది. అందులో భాగంగా జనవరి 26న జిల్లా వ్యాప్తంగా ఒక్కో మండలం ఒక్కో గ్రామాన్ని పైలెట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసి 2,181 మందికి ఆత్మీయ భరోసా అందించారు.

70 గ్రామాలకే పరిమితం

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 70మండలాల్లో ఒక్కో గ్రామ పంచాయతీని పైలెట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసి జనవరి 26న 2.181 మందికి మంజూరు పత్రాలను అందజేశారు. తర్వాత రూ.6వేల చొప్పున బ్యాంక్‌ ఖాతాలలో రూ. 1,30,86,000 జమ చేశారు. పైలెట్‌ ప్రాజెక్ట్‌లో అందుకున్న వారికి మరో నెల రోజులైతే రెండో విడత సాయం అందించాల్సిన సమయం వస్తుంది. మిగతా లబ్ధిదారులకు ఆత్మీయ భరోసా వస్తుందా? రాదా ? అని ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఇస్తారనేది అధికారులు ఎవరు చెప్పడం లేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింది ఎంపిక చేసిన లబ్ధిదారులకు సాయం అందజేయాలని కోరుతున్నారు.

ఆత్మీయ పథకం వివరాలు..

జిల్లా లబ్ధిదారులు

సంగారెడ్డి 22,792

సిద్దిపేట 16,505

మెదక్‌ 12,521

పైలెట్‌ గ్రామాలకే పరిమితమా..

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 51,818 మంది లబ్ధిదారులు ఎంపిక

త్వరగా అందజేయాలంటూ వేడుకోలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా..

వ్యవసాయ భూమి లేనివారు, ఉపాధి హామీ కూలీగా 20 రోజుల పాటు పని చేసిన వారు అర్హులని నిబంధన పెట్టారు. లబ్ధిదారుల ఎంపిక కోసం ఫీల్డ్‌ అసిస్టెంట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 1,531 గ్రామాల్లో 51,818 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వారిలో ఇప్పటి వరకు 2,181 మందికే అందించడంతో 49,637 మంది లబ్ధిదారులు ఆత్మీయ భరోసా కోసం ఎదురు చూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement