లక్ష్యం మేరకు మొక్కలు నాటాలి | - | Sakshi
Sakshi News home page

లక్ష్యం మేరకు మొక్కలు నాటాలి

Jun 24 2025 7:38 AM | Updated on Jun 24 2025 7:38 AM

లక్ష్

లక్ష్యం మేరకు మొక్కలు నాటాలి

అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌

సంగారెడ్డి జోన్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా లక్ష్యం మేరకు మొక్కలు నాటాలని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో మన మహోత్సవం కార్యక్రమంపై సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. మొక్కలు నాటేందుకు ముందుగానే అనువైన స్థలాలను గుర్తించాలని సూచించారు.

ఫార్మర్‌ రిజిస్ట్రీ చేసుకోవాలి

కల్హేర్‌(నారాయణఖేడ్‌): రైతులు తప్పనిసరిగా ఫార్మర్‌ రిజిస్ట్రీ చేసుకోవాలని నారాయణఖేడ్‌ ఏడీఏ నూతన్‌కుమార్‌ కోరారు. సోమవారం మండలంలోని కృష్ణాపూర్‌లో ఫార్మర్‌ రిజిస్ట్రీ ప్రక్రియ చేపట్టారు. ఫార్మర్‌ రిజిస్ట్రీ గురించి అవగాహన కల్పించారు.

వాసవీమాతదయతోనే పదవి

సంగారెడ్డి టౌన్‌: వాసవీ కన్యకా పరమేశ్వరీమాత దయతోనే తనకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పదవి దక్కిందని తోపాజి అనంత కిషన్‌ పేర్కొన్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తోపాజి అనంత కిషన్‌ను సంగారెడ్డిలోని శ్రీ వాసవీ మహాసంస్థాన్‌లో సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఆర్య వైశ్యులు దేవాలయ కమిటీ సభ్యులు, తనపై చూపుతున్న ఆదరాభిమానాలకు సదా కృతజ్ఞుడినన్నారు. దేవాలయాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీనిచ్చారు.

పెండింగ్‌ వేతనాలు

చెల్లించాలి

జహీరాబాద్‌ టౌన్‌: పెండింగ్‌లో ఉన్న ఆస్పత్రి కార్మికుల వేతనాలను తక్షణమే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మహిపాల్‌ కోరారు. ప్రభుత్వాస్పత్రి కాంట్రాక్టు కార్మికులతో కలిసి సోమవారం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహిపాల్‌ మాట్లాడుతూ...ప్రతీ నెల 7 తేదీలోపు జీతాలు ఇవ్వాల్సి ఉండగా 23 రోజులైనా ఇంతవరకు చెల్లించలేదన్నారు. కార్మికులంతా నిరుపేదలని, జీతంపైనే ఆధారపడి కుటుంబ పోషణ చేస్తున్నారని వాపోయారు. రెండురోజుల్లో జీతాలు చెల్లించకుంటే విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు.

కేజీబీవీలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

జహీరాబాద్‌ టౌన్‌: హోతి(కె) కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఖాళీగా ఉన్న కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని ప్రత్యేకాధికారి ఎం.లక్ష్మి సోమవారం ప్రకటనలో తెలిపారు. విద్యాలయంలో అటెండర్‌, నైట్‌ వాచ్‌ఉమెన్‌, అసిస్టెంట్‌ కుక్‌, స్వీపర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. మొగుడంపల్లికి చెందిన విద్యాలయంలో హోతి(కె)లో కొనసాగుతుందని, స్థానికులు మాత్రమే ఈ నెల 28 లోపు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. 18–45 ఏళ్ల వయసు కలిగిన మహిళలు అర్హులన్నారు. వాచ్‌మెన్‌ పోస్టుకు 10వ తరగతి , అసిస్టెంట్‌ కుక్‌కు 7వ తరగతి చదవి ఉండాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9542174387 నంబర్‌కు సంప్రదించాలని చెప్పారు.

అందాల పోటీల్లో

జహీరాబాద్‌ బాలిక

జహీరాబాద్‌ టౌన్‌: జహీరాబాద్‌లోని అల్లీపూర్‌కు చెందిన ప్రార్థన రాయ జూనియర్‌ మిస్‌ ఇండియా అందాల పోటీల్లో పాల్గొన్నారు. బట్టు రాజు బెంజిమన్‌ కుమార్తె ప్రార్థనరాయ(13) హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నెక్సాస్‌మాల్‌లో సోమవారం జరిగిన అందాల పోటీలకు హాజరై ర్యాంప్‌ వాక్‌ చేశారు. పట్టణంలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న ప్రార్థనరాయ ఈ పోటీల్లో పాల్గొనడం పట్ల తల్లిదండ్రులు బెంజిమన్‌, ప్రణీతలు హర్షం వ్యక్తం చేశారు.

లక్ష్యం మేరకు మొక్కలు నాటాలి1
1/1

లక్ష్యం మేరకు మొక్కలు నాటాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement