
● ఆ పాఠశాలల బకాయిలు చెల్లించాలి
దళిత, గిరిజనసంఘాల డిమాండ్
సంగారెడ్డి ఎడ్యుకేషన్: బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు చెందిన బకాయిలు తక్షణ మే చెల్లించాలని దళిత, గిరిజన సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. ఈ మేరకు సోమవారం ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల తల్లిదండ్రులు, దళిత సంఘా ల నాయకులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ... మూడేళ్ల నుంచి రావాల్సిన బకాయిలు రూ.200 కోట్లకు పైగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఆ పాఠశాలలకు బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులను యాజమాన్యాలు పాఠశాలలకు రానివ్వడం లేదన్నారు. బెస్ట్ అవైలబుల్ హాస్టల్స్ను తెరిపించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రావీ ణ్యకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుడు జైపాల్ నాయక్, అంబేడ్కర్ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు జగన్ తదితరులు పాల్గొన్నారు.