
● అమ్మ ఆదర్శ కమిటీలను రద్దు చేయాలి
ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ప్రసాద్
సంగారెడ్డి ఎడ్యుకేషన్: అమ్మ ఆదర్శ కమిటీలను రద్దు చేసి ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్యకార్మికులను, స్వీపర్లను విద్యాశాఖ ఆధ్వర్యంలోనే కొనసాగించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ప్రసాద్ డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం స్వీపర్లు, పారిశుద్ధ్య కార్మికులు చలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ...విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఇస్తున్న రూ.2 వేల నుంచి రూ. 3 వేలు కాకుండా స్కావెంజర్లకు , స్వీపర్ లకు కనీస వేతనంగా రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారి పనికి సంబంధించిన సామగ్రిని, యూనిఫాంను, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలను కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సాయిలు, సహాయ కార్యదర్శి లక్ష్మి, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.