
పీహెచ్డీ అవార్డు గ్రహీతలకు సన్మానం
సంగారెడ్డి ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇటీవల పీహెచ్డీ అవార్డును పొందిన ఐదుగురు అధ్యాపక బృందానికి సోమవారం అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.ఎస్.రత్న ప్రసాద్ మీడియాకు వివరించారు. నూతనంగా డాక్టరేట్ పొందిన అధ్యాపకులలో వృక్షశాస్త్ర విభాగానికి చెందిన డాక్టర్ సోఫియా రాణి, మైక్రో బయాలజీ విభాగానికి చెందిన డాక్టర్ వెంకట రామచందర్, కామర్స్ విభాగానికి చెందిన డాక్టర్ రవీందర్, కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ అశ్విని, ఫిజిక్స్ విభాగానికి చెందిన డాక్టర్ మంజులను కళాశాల అధ్యాపక బృందం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ నిర్మల, జగదీశ్వర్, కళాశాల అడ్మినిస్ట్రేటివ్ అధికారి కామరాజ్, కళాశాల అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.