కారు ఢీకొనడంతో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

కారు ఢీకొనడంతో వ్యక్తి మృతి

Jun 24 2025 7:38 AM | Updated on Jun 24 2025 7:38 AM

కారు ఢీకొనడంతో వ్యక్తి మృతి

కారు ఢీకొనడంతో వ్యక్తి మృతి

కొల్చారం(నర్సాపూర్‌): ఎదురుగా వస్తున్న బైకును కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన కొల్చారం మండలంలోని మెదక్‌– నర్సాపూర్‌ జాతీయ రహదారి కిష్టాపూర్‌ సమీపంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. ఎస్‌ఐ మహమ్మద్‌ గౌస్‌ కథనం ప్రకారం.. పాపన్నపేట మండలం రామతీర్థం గ్రామానికి చెందిన కన్నెబోయిన గంగారాం (33) ఉదయం తన బైక్‌పై ఏడుపాయల నుంచి మెదక్‌కు పనిపై వెళ్తున్నాడు. కిష్టాపూర్‌ సమీపంలోని తెలంగాణ క్రీడా ప్రాంగణం సమీపంలోకి రాగానే.. మెదక్‌ వైపు నుంచి వస్తున్న కారు.. గంగారం బైకును బలంగా ఢీకొట్టింది. దీంతో తలకు తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కారు డ్రైవర్‌ అతి వేగమే ప్రమాదానికి కారణమని ఎస్‌ఐ తెలిపారు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement