
రైస్మిల్లు కార్యాల యంలో రూ. 90 వేలు చోరీ
శివ్వంపేట(నర్సాపూర్): రైస్మిల్లు కార్యాలయంలో చోరీ జరిగింది. ఈ సంఘటన అదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. శివ్వంపేట గ్రామ శివారులో ఉన్న ఓంసాయి వెంకటరమణ రైస్మిల్లు కార్యాలయంలోకి గుర్తుతెలియని వ్యక్తి గదుల తాళాలు పగులగొట్టి లోనికి చొరబడ్డాడు. కౌంటర్లో ఉన్న రూ.90 వేలు తస్కరించాడు. నిందితుడు ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌజ్ ధరించి సీసీ కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్త పడ్డాడు. ఎస్ఐ మధుకర్రెడ్డి, క్లూస్ టీం పరిశీలించి ఆధారాలు సేకరించారు. మిల్లు యజమాని రంగాయ్యగుప్తా ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఉసురు తీసిన అప్పులు
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
పాపన్నపేట(మెదక్): అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ సంఘటన పాపన్నపేట మండల పరిధిలోని మల్లంపేటలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చింతకుంట గంగయ్య(50) వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. పొలంలో మూడు బోర్లు వేసినా ఆశించిన రీతిలో నీరు పడలేదు. దీంతో పంట దిగుబడి తగ్గింది. దీనికి పెద్దకూతురు పెళ్లికి అప్పు చేశాడు. అప్పులను తీర్చడానికి భూమి అమ్మాలని నిర్ణయించుకున్నాడు. కానీ.. ప్రస్తుతం భూమి అమ్మితే.. ,రెండో కూతురు పెళ్లి ఎలా చేయాలన్న ఆవేదనతో ఈ నెల 15న క్రిమి సంహారక మందు తాగాడు. పరిస్థితి విషమంగా మారడంతో వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.
పార్ట్టైం జాబ్ పేరిట మోసం
రూ.6.58 లక్షలు పోగొట్టుకున్న బాధితుడు
నర్సాపూర్: సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి ఓ వ్యక్తి రూ.6.58 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన నర్సాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పార్ట్టైం జాబ్ పై ఆసక్తి ఉన్న వ్యక్తులు ఈ లింకు ఓపెన్ చేయాలని ఉదయ్కిరణ్కు మెసేజ్ వచ్చింది. అతను లింకును ఓపెన్ చేయగా రూ.10,870 బోనస్ పాయింట్స్ వచ్చాయని ఉంది. అనంతరం కొన్ని రోజులకు రూ.10 వే లు పెట్టుబడి పెట్టాడు. దీంతో ఖాతాకు కొన్ని డబ్బులు వచ్చాయి. కొన్నాళ్ల పాటు వైబ్సైట్కు ఉదయ్కిరణ్ డబ్బులు పంపడం, అతనికి తిరి గి డబ్బులు వచ్చాయి. ఇలా రూ.6.58 లక్షలు జమ చేశాడు. డబ్బులు డ్రా చేసుకునేందుకు యత్నించగా.. అది పని చేయకపోవడంతో మోస పోయాయని గ్రహించిన ఉదయ్కిరణ్ గుర్తించి సైబర్ క్రైంకు ఫిర్యాదు చేశాడు.
మోకు మేకై ంది
తాటి చెట్టుపై నుంచి పడి
గీత కార్మికుడికి గాయాలు
చేర్యాల(సిద్దిపేట): తాటి చెట్టు పైనుంచి పడి ఓ గీత కార్మికుడు గాయపడ్డాడు. ఈ సంఘటన మండల పరిధిలోని పెద్దరాజుపేటలో సోమవారం సాయంత్రం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొయ్యడ చంద్రంగౌడ్ ఎప్పటిలాగే కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కి దిగుతుండగా ప్రమాదవశాత్తూ మోకు జారి కింద పడ్డాడు. గమనించిన తోటి గీత కార్మికులు.. వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స నిర్వహించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కల్లు గీత వృత్తిపైనే ఆధారపడి జీవించే చంద్రంను ప్రభుత్వం ఆదుకోవాలని కల్లు గీత కార్మిక సంఘం సిద్దిపేట జిల్లా కార్యదర్శి అరుణ్ కోరారు.
ఏడుగురు జూదరుల అరెస్టు
చేగుంట(తూప్రాన్): జూదం ఆడుతున్న వ్యక్తులను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన చేగుంట మండలంలోని చిట్టోజిపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం చిట్టోజిపల్లి శివారులో జూదం ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఏడుగురు నిందితులను పట్టుకొని, వారి వద్ద నుంచి రూ.44వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ రాజారెడ్డి తెలిపారు.
సీజ్ చేసిన ఇసుక డంప్ మాయం
తూప్రాన్: సీజ్ చేసిన ఇసుక డంప్ మాయమైంది. ఈ మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలంలోని కిష్టాపూర్ హల్దీవాగులో అక్రమంగా ఇసుక ఫిల్టర్ ద్వారా తయారు చేసిన ఇసుక డంప్ను ఎస్ఐ శివానందం, రెవెన్యూ అధికారులు ఈ నెల 20న సీజ్ చేశారు. 23న సోమవారం వేలం పాట నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ అధికారులు ప్రకటించారు. కానీ సీజ్ చేసిన ఇసుక డంప్ను అక్రమ వ్యాపారులు రాత్రికి రాత్రే డంప్ను మాయం చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

రైస్మిల్లు కార్యాల యంలో రూ. 90 వేలు చోరీ

రైస్మిల్లు కార్యాల యంలో రూ. 90 వేలు చోరీ