
పరేక్ప్లాస్ట్ కార్మికులకు మెరుగైన వేతనాలు
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి
పటాన్చెరు: పటాన్చెరు పరిధిలోని పరేక్ ప్లాస్ట్ పరిశ్రమ కార్మికులకు మెరుగైన వేతనాలు కల్పించేందుకు ఒప్పందం చేసినట్లు పరేక్ ప్లాస్ట్ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డిలోని కార్మిక శాఖ కార్యాలయంలో డీసీఎల్ రవీందర్ రెడ్డి సమక్షంలో శనివారం పరిశ్రమ యాజమాన్యం తరఫున సమీర్ కులకర్ణి, కార్మిక సంఘం తరఫున యూనియన్ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ మధ్య వేతన ఒప్పందంపై చర్చలు జరిగాయని తెలిపారు. మెరుగైన వేతన ఒప్పందం అందిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వేతన ఒప్పందంలో రాబోయే మూడేళ్లకు గాను ప్రస్తుతం అందుకుంటున్న వేతనానికి అదనంగా ప్రతీ కార్మికుడు ప్రతీ ఏటా రూ.4 వేల చొప్పున మొత్తం 12 వేల వేతనం అందుకునేలా ఒప్పందంలో పేర్కొన్నట్లు తెలిపారు. ప్రతీ దసరాకు రూ. 2,500 యాన్యువల్ డే గిఫ్ట్తో పాటు, బోనస్, ఇతర సౌకర్యాలు లభిస్తాయన్నారు.