
నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
బాలికపై అత్యాచారం కేసులో..
రామచంద్రాపురం(పటాన్చెరు): బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సంగారెడ్డి న్యాయస్థానం బుధవారం తీర్పు నిచ్చింది. కొల్లూరు పోలీసుల కథనం మేరకు.. 2023 సెప్టెంబర్లో ఝరాసంగం మండలం భోజ్యనాయక్ తండాకు చెందిన బానోత్ శ్రీను డాన్స్ అసిస్టెంట్ మాస్టర్గా పని చేస్తున్నాడు. తెల్లాపూర్లోని విల్లాస్లో పిల్లలకు డాన్స్ నేర్పించడానికి వచ్చి డాన్స్ గ్రూపులోని ఐదేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన నాటి ఇన్స్పెక్టర్ సంజయ్, ప్రస్తుత ఇన్స్పెక్టర్ రవీందర్, కానిస్టేబుళ్లు శ్రీకాంత్, సుభాష్, కోర్టు కానిస్టేబుల్ నర్సింహులు, ఏఎస్ఐ రవీందర్ రెడ్డి సరైన సాక్షాధారాలను సేకరించి సంగారెడ్డి కోర్టు ముందు ఉంచారు. ఈ కేసును విచారించిన ఫస్ట్ అదనపు డిస్టిక్ట్ సెషన్స్ న్యాయమూర్తి కే.జయంతి నిందితుడు భానోత్ శ్రీనుకు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధించారు. ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.సూరరెడ్డి వాదించారు. నిందితుడికి శిక్ష పడేలా చూసిన పోలీస్ అధికారులను మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ రావు అభినందించారు.