
పింఛన్ కోసం వృద్ధుల పాట్లు
నర్సాపూర్ : పింఛన్ కోసం వృద్ధులు నానా పాట్లు పడుతున్నారు. నర్సాపూర్కు చెందిన వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు స్థానిక పోస్ట్ ఆఫీసు ద్వారా ప్రతి నెల పింఛన్లను పంపిణీ చేస్తారు. కాగా పోస్ట్ ఆఫీసు వద్ద నీడ, కూర్చునేందుకు బెంచీలు లాంటి వసతులు లేకపోవడంతో ఎండలోనే నిలబడ్డారు. అరుగులపై , చెట్టు కింద కూర్చొని నిరీక్షించారు. అధికారులు కనీస వసతులు ఏర్పాటు చేయాలని కోరారు. మంగళవారం మార్చి నెల పింఛన్ ఇస్తున్నారని తెలిసి వచ్చామని వృద్ధులు చెప్పారు. ఈ విషయమై స్థానిక పోస్ట్ మాస్టర్ హరిప్రసాద్ను వివరణ కోరగా సోమవారం సాయంత్రం ఫండ్ వచ్చిందని, ఈరోజే పంపిణీ ప్రారంభించామని పేర్కొన్నారు.