ఇంటర్‌లో ఫెయిల్‌ అయ్యానని ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌లో ఫెయిల్‌ అయ్యానని ఆత్మహత్య

Apr 27 2025 7:54 AM | Updated on Apr 27 2025 7:54 AM

ఇంటర్‌లో ఫెయిల్‌ అయ్యానని ఆత్మహత్య

ఇంటర్‌లో ఫెయిల్‌ అయ్యానని ఆత్మహత్య

హుస్నాబాద్‌రూరల్‌: ఉరేసుకొని ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం హుస్నాబాద్‌ పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. పట్టణానికి చెందిన దండవేణి శ్రీనివాస్‌, లావణ్య దంపతులకు కూతురు సంజన (16), కుమారుడు ఉన్నారు. సంజన ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతుంది. ఇటీవల ఇంటర్మీడియట్‌ ఫలితాలు రావడంతో సంజన ఫెయిల్‌ అయ్యింది. దీంతో మనస్తాపం చెంది మానసిక ఒత్తిడికి లోనైంది. శనివారం తల్లిదండ్రులు పనుల నిమిత్తం బయటకు వెళ్లగా సాయంత్రం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లోకి వెళ్లిన సోదరుడు ఉరేసుకున్న అక్కని చూసి తండ్రికి ఫోన్‌ చేసి చెప్పాడు. ఎస్‌ఐ మహేశ్‌ను వివరణ కోరగా విద్యార్థిని ఆత్మహత్య విషయంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.

హుస్నాబాద్‌లో ఉరేసుకున్న విద్యార్థిని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement