
బీసీ హక్కుల కోసం నిరంతర పోరాటం
షాబాద్: బీసీల హక్కుల కోసం నిరంతర పోరాటం చేస్తామని బీసీసేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో బుధవారం బీసీసేన మండల సమావేశం నిర్వహించారు. అనంతరం మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీసీసేన మండల అధ్యక్షుడిగా దామర్లపల్లి గ్రామానికి చెందిన కమ్మరి దయాకర్చారిని నియమించారు. ఉపాధ్యక్షుడిగా గోపాల్, యూత్ అధ్యక్షుడిగా బండ అజయ్కుమార్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణాయాదవ్ మాట్లాడుతూ.. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలంతా పోటీకి సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో బీసీసేన జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, షాద్నగర్ నియోజకవర్గం అధ్యక్షుడు కత్తి శేఖరప్ప, మహిళా అధ్యక్షురాలు బాస వరలక్ష్మి, ఫరూఖ్నగర్ మండల అధ్యక్షుడు మేకల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
బీసీసేన జాతీయ అధ్యక్షుడు
బర్క కృష్ణాయాదవ్