దైవ దర్శనానికి వెళ్తూ మృత్యు ఒడికి | - | Sakshi
Sakshi News home page

దైవ దర్శనానికి వెళ్తూ మృత్యు ఒడికి

Jun 12 2025 11:03 AM | Updated on Jun 12 2025 11:03 AM

దైవ దర్శనానికి వెళ్తూ మృత్యు ఒడికి

దైవ దర్శనానికి వెళ్తూ మృత్యు ఒడికి

బొంరాస్‌పేట: ఎదురుగా వచ్చిన డీసీఎం కారును ఢీకొట్టిన సంఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మండల పరిధిలోని జాతీయ రహదారి 163పై మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఐ రవూఫ్‌ వివరాల మేరకు.. హైదరాబాద్‌లో వ్యాపారం చేస్తున్న బీజాపూర్‌ వాసి కంచి వెంకటేశ్వర్‌రావు(48), భార్య కళ్యాణితో కలిసి కారులో తన కారులో కర్ణాటకలోని గానుగాపూర్‌ దత్తత్రేస్వామి దర్శనానికి వెళ్తున్నారు. ఈక్రమంలో బీజాపూర్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న డీసీఎం భోజన్నగడ్డతండా గేటు వద్ద వీరి కారును ఢీకొంది. దీంతో కారు నడుపుతున్న వెంకటేశ్వర్‌రావు అక్కడికక్కడే మృతి చెందగా కళ్యాణికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను మొదట పరిగి ఆస్పత్రికి ఆతర్వాత హైదరాబాద్‌ తరలించారు. డీసీఎం డ్రైవర్‌ జానప్పపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.

కారును ఢీకొట్టిన డీసీఎం

వ్యక్తి మృతి, మహిళకు గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement