బస్‌ చార్జీలను తగ్గించండి | - | Sakshi
Sakshi News home page

బస్‌ చార్జీలను తగ్గించండి

Jun 12 2025 11:02 AM | Updated on Jun 12 2025 11:02 AM

బస్‌

బస్‌ చార్జీలను తగ్గించండి

తుర్కయంజాల్‌: పెంచిన ఆర్టీసీ బస్‌ చార్జీలను వెంటనే తగ్గించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కొంతం మాధవరెడ్డి డిమాండ్‌ చేశారు. తుర్కయంజాల్‌లో బుధవారం ఆయన మాట్లాడుతూ.. పెంచిన చార్జీలతో పేద ప్రజలు, విద్యార్థులకు ఆర్థిక భారం కానుందన్నారు. చార్జీల పెంపును వెనక్కి తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి, టి.బాలయ్య, బీరప్ప, గంధం బాలరాజ్‌, నరేందర్‌, కాటమయ్య, రేఖ, అండాలు, సావిత్రి పాల్గొన్నారు.

ప్రభుత్వ భూమిలో

ఫెన్సింగ్‌ తొలగింపు

కేశంపేట: మండల పరిధిలోని చింతకుంటపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని గ్రామస్తులు నాయబ్‌ తహసీల్దార్‌ గీతకు ఫిర్యాదు చేశారు. గ్రామంలోని సర్వేనంబర్‌ 98లో మూడు ఎకరాల ప్రభుత్వ భూమికి కొందరు ఫెన్సింగ్‌ వేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్‌ఐ చెన్నకేశవులు ఫెన్సింగ్‌ వేసి భూమిని పరిశీలించారు. ప్రభుత్వ భూమిలో పాతిన కడీలను తొలగించారు.

నేడు డయల్‌ యువర్‌ డీఎం

షాద్‌నగర్‌: ఆర్టీసీ ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు గురువారం డయల్‌ యువర్‌ డీఎం నిర్వహించనున్న ట్టు షాద్‌నగర్‌ డిపో మేనేజర్‌ ఉష బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కార్య క్రమం ఉంటుందని తెలిపారు. ప్రయాణికులు తమ సమస్యలు, సూచనలు, సలహాలు తెలియజేయాలని కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 99592 26 287 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

సంక్షేమ నిధి ఏర్పాటు

హర్షణీయం

మొయినాబాద్‌: దేవాలయాల్లో పనిచేసే అర్చకులు, ఇతర ఉద్యోగులకు లబ్ధి చేకూరేవిధంగా ప్రభుత్వం ప్రత్యేకంగా సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడంపై దేవాలయాల పరిరక్షణ ఉద్యమం కన్వీనర్‌, చిలుకూరు బాలాజీ దేవాలయం వంశపారంపర్య అర్చకుడు రంగారజన్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 17 ఏళ్లకుపైగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను పరిష్కరించినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 1997లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ నిధి ఏర్పడినా పూర్తిస్థాయిలో అమలు కాలేదన్నారు. 2014లో రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి పూర్తిస్థాయి సంక్షేమ నిధి ఏర్పాటు అంశం పెండింగ్‌లోనే ఉందన్నారు. సంక్షేమ నిధి ఏర్పాటుపై సోమవారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటన చేశారని.. దానికి సంబంధించిన పోస్టర్‌ విడుదల చేశారన్నారు. ఈ నిధి ఏర్పటుతో చిన్నస్థాయి నుంచి అసిస్టెంట్‌ కమిషనర్‌ స్థాయి వరకు 13,700 మంది అర్చకులు, ఇతర సిబ్బందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు.

బస్‌ చార్జీలను తగ్గించండి
1
1/1

బస్‌ చార్జీలను తగ్గించండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement