అన్యాయంగా భూములు లాక్కోవద్దు | - | Sakshi
Sakshi News home page

అన్యాయంగా భూములు లాక్కోవద్దు

Jun 12 2025 11:02 AM | Updated on Jun 12 2025 11:02 AM

అన్యాయంగా భూములు లాక్కోవద్దు

అన్యాయంగా భూములు లాక్కోవద్దు

తుక్కుగూడ: అన్యాయంగా తమ భూములు లాక్కోవద్దని మున్సిపల్‌ పరిధిలోని రావిర్యాలకు చెందిన పలువురు దళితులు వాపోయారు. మున్సిపల్‌ పరిధిలోని రావిర్యాలకు చెందిన దళితులు కొంగర ఖుర్దు ఏ సర్వే నంబర్‌ 73లోని 42 ఎకరాల 36 గంటల అసైన్డ్‌ భూమిని సాగు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఈ భూమిపై సుమారు 100 కుటంబాలు ఆధారపడ్డాయి. సదరు భూమిని ప్రభుత్వం తమకి కేటాయించిందని తెలంగాణ హౌసింగ్‌ బోర్డ్‌ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకోవడానికి పోలీస్‌ బందోబస్తుతో వచ్చారు. జేసీబీలతో చదును చేయించి చుట్టూ కంచె వేసేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న రైతులు కుటుంబ సభ్యులతో కలిసి భూమి వద్దకు చేరుకున్నారు. అక్కడే కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో హౌసింగ్‌ బోర్డ్‌ అధికారులు, రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమకి ప్రభుత్వం ఎలాంటి నోటీసులు గానీ, సమాచారంగానీ లేకుండా భూమిని తీసుకోవడం అన్యాయమని రైతులు పేర్కొన్నారు. 1952 నుంచి సాగు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నామని తెలిపారు. ఇప్పటికే ఈ భూమి నుంచి గ్రీన్‌ఫిల్డ్‌ రోడ్డు ఏర్పాటుకు మార్కింగ్‌ చేశారన్నారు. తమ భూములను తీసుకొని అన్యాయం చేయొద్దని ఆందోళన చేశారు.

దళిత భూముల జోలికి రావద్దు

సమాచారం అందుకున్న మాజీ మంత్రి, మహేశ్వ రం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి అక్కడికి చేరుకున్నారు. రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హౌ సింగ్‌ బోర్డ్‌ అధికారులు, పోలీసులతో మాట్లాడా రు. దళిత రైతులకు సమాచారం ఇవ్వకుండా వారి భూములను స్వాధీనం చేసుకోవడం తగదని అన్నా రు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు దళిత భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement