వరుణుడే ఆలస్యం | - | Sakshi
Sakshi News home page

వరుణుడే ఆలస్యం

Jun 11 2025 11:48 AM | Updated on Jun 11 2025 11:48 AM

వరుణు

వరుణుడే ఆలస్యం

దుక్కులు సిద్ధం

యాచారం: ఈ ఏడు ముందస్తు రుతుపవనాలు వస్తాయన్న వాతావరణ శాఖ ప్రకటనతో తొలుత రైతులు ఆనందం వ్యక్తంచేశారు. సాగుకు కావాల్సిన సరంజామా సిద్ధంగా ఉంచుకున్నారు. అయినప్పటికీ.. ఆకాశంలో మబ్బులే తప్ప.. వాన జాడ లేదు. దీంతో ఈ ఏడాది అదునులో పంటలు సాగవుతాయా, లేదా అని భయాందోళన చెందు తున్నారు. వర్షాలు పడకపోవడంతో పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ఇక మెట్ట పంటల సాగు కష్టమేనని భావిస్తున్నారు. రోహిణిలో వర్షాలు పడకపోగా.. మృగశిర కార్తె ప్రారంభమై నాలుగు రోజులు గడుస్తున్నా వరుణుడు కరుణించకపోవడంతో దిక్కులు చూస్తున్నారు.

మెట్ట పంటలకు పది రోజులే గడువు

సమృద్ధిగా వర్షాలు కురిస్తే మెట్ట పంటలు పత్తి, కంది, ఆముదం, జొన్న, సజ్జ తదితర పంటల సాగు కు వారం, పది రోజులే అనువైన గడువని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. జూన్‌ 15 లోపు వరకు, ఆ తర్వాత మరో వారం విత్తనాలు విత్తుకోవడానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేస్తున్నా రు. రోహిణి కార్తెలో కురిసిన వర్షాలకు జిల్లాలోని ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల, మాడ్గుల, ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల్‌, షాద్‌నగర్‌, మహేశ్వరం, కందుకూరు, కొత్తూర్‌ తదితర మండలాల్లో కొంత మంది రైతులు పత్తి, జొన్నను సా గు చేశారు. ఆ తర్వాత వాన పడకపోవడంతో విత్తి న విత్తనాలు మొలకెత్తే పరిస్థితి లేక.. పెట్టుబడులు కోల్పోయామంటూ ఆందోళన చెందుతున్నారు.

అవగాహన సదస్సులు

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ విశ్వ విద్యాల యం, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో ‘రైతు ముగింట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంతో అధికా రులు, శాస్త్రవేత్తలు 20 రోజులుగా గ్రామాల్లో విసృత్తంగా సదస్సులు నిర్వహిస్తున్నారు. సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. తొలకరితో జిల్లాలో 25 వేల ఎకరాలకుపై గా పత్తి, జొన్న, కంది తదితర మెట్ట పంటలను రైతులు సాగు చేసినట్లు అధికారులు గుర్తించారు. వరి విషయానికి వస్తే రోహిణి కార్తెలో నారు పోస్తే ఆశించిన దిగుబడి వస్తుందని రైతుల్లో ఆశ. కానీ వరుణుడు నిరాశపర్చడం, ఎండలు మండుతుండటంతో చెరువులు, కుంటలు ఎండిపోయాయి. బోరుబావులు అడుగంటాయి. ఈ కష్టాలన్నీ గట్టెక్కాలంటే భారీ వర్షాలు కురవాల్సిందేనని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. నార్లు పోసుకోవడానికి నీరున్న రైతులు.. కొద్ది పొలంలోనే పోసుకుని, సంరక్షించుకోవాలని సూచిస్తున్నారు.

జిల్లాలో వానాకాలం సాగు అంచనా వివరాలు

పంట పేరు అంచనా సాగు(ఎకరాల్లో)

వరి 1,40,238

జొన్న 5,562

సజ్జ 21

మొక్కజొన్న 52,207

రాగులు 30

కందులు 14,308

మినుములు 4

పెసర్లు 13

ఉలవలు 42

ఆముదాలు 37

వేరు శనగ 96

పొద్దు తిరుగుడు 1

నువ్వులు 10

సోయాబీన్‌ 50

పతి 1,41,088

ఇతర పంటలు 4,382

కానరాని వానజాడ.. కర్షకుల ఆందోళన

సాగుకు పొలాలు సిద్ధం

విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లు పూర్తి

మెట్ట పంటలు కష్టమేనంటున్న రైతులు

జిల్లాలో 3,58,089 ఎకరాల్లో సాగు అంచనా

వర్షం పడితేనే విత్తనాలు

తగిన వర్షాలు పడితేనే విత్తనాలు విత్తుకోవాలని, తడిపొడి భూమిలో విత్తితే మొలకెత్తకపోవడంతో పాటు.. పెట్టుబడి కోల్పోవాల్సి వస్తుందని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా.. జిల్లాలో ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో 3,58,089 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. అత్యధికంగా పత్తి 1,41,088 ఎకరాల్లో, వరి 1,40,238, మొక్కజొన్న 52,207 ఎకరాల్లో సాగ వుతుందని పేర్కొంటున్నారు. సాగుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను వ్యవసాయ శాఖ సిద్ధం చేసి ఉంచిందని తెలిపారు.

అదును దాటుతోంది. వర్షాల జాడ కానరావడం లేదు. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పక్షం రోజుల క్రితం పలకరించిన తొలకరితో.. రైతులు వ్యవసాయ పొలాలను సిద్ధం చేసుకున్నారు. వర్షాలు కురిసిన వెంటనే విత్తనాలు విత్తుకోవడానికి రూ.లక్షలు వెచ్చించి ఎరువులు, విత్తనాలు కొనుగోళ్లు చేశారు. వరుణుడు ముఖం చాటేయడంతో కలవరానికి గురవుతున్నారు. ఆకాశం వైపు దీనంగా చూస్తున్నారు.

వరుణుడే ఆలస్యం1
1/1

వరుణుడే ఆలస్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement