
పీసీసీ అధ్యక్షుడికి కృతజ్ఞతలు
కందుకూరు: పీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితుడైన మండల పరిధిలోని దెబ్బడగూడకు చెందిన ఏనుగు జంగారెడ్డి మంగళవారం పీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్కుమార్గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛంఅందించి కృతజ్ఞతలు తెలిపా రు. పార్టీ బలోపేతానికి తన శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి ఉన్నారు.
హైటెన్షన్ లైన్ రూట్ మార్చాలని వినతి
కేశంపేట: ఇళ్లకు సమీపం నుంచి 765 కేవీ హైటెన్షన్ వైర్లు వెళ్తున్నాయని, వాటిని రూట్ మార్చాలంటూ కేంద్ర విద్యుత్శాఖ సహాయమంత్రి శ్రీపాద్యశో నాయక్కు పోమాల్పల్లి గ్రామస్తులు విన్నవించారు. ఈ మేరకు గోవాలోని మంత్రి నివాసంలో మంగళవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. స్పందించిన ఆయన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు గ్రామస్తులు తెలిపారు. కేంద్ర సహాయమంత్రిని కలిసిన వారిలో బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు నర్సింహయాదవ్, కుమ్మరి మహేశ్, భూపాల్రెడ్డి తదితరులు ఉన్నారు.
13న ఇంటర్ ప్రవేశాలకు స్పాట్ కౌన్సెలింగ్
మహేశ్వరం: స్థానిక గిరిజన బాలుర సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం సీఈసీ, హెచ్ఈసీ గ్రూపుల్లో ఖాళీలు ఉన్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ నళిని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మిగిలిన సీట్లకు ఈనెల 13న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.
సున్నిత ప్రాంతాల్లో
రాచకొండ సీపీ తనిఖీలు
పహాడీషరీఫ్: సున్నితమైన బాలాపూర్, పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ల పరిధిలో రాచకొండ పోలీ స్ కమిషనర్ జి.సుధీర్ బాబు మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. రెండు ఠాణాల పరిధిలో విజిబుల్ పోలీసింగ్తో పాటు స్థానిక పోలీసులు వాహనాల తనిఖీ ఏ తరహా చేపడు తున్నారనే విషయమై మహేశ్వరం జోన్ డీసీపీ డి.సునీతా రెడ్డితో కలిసి పర్యవేక్షించారు. విజి బుల్ పోలీసింగ్ ద్వారా ప్రజలకు భద్రత విష యంలో భరోసా కల్పించాలని బాలాపూర్, పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్లు ఎం.సుధాకర్, పి.గురువారెడ్డికి సూచించారు. నగర శివారు ప్రాంతం కావడంతో ఎప్పటికప్పుడు వాహనాల తనిఖీ చేపట్టాలన్నారు. తనిఖీల సమయంలో పరిశీలించాల్సిన అంశాలపై సూచనలు చేశా రు. తనిఖీల్లో మహేశ్వరం అదనపు డీసీపీ సత్యనారాయణ, ఏసీపీ జానకీ రెడ్డి పాల్గొన్నారు.

పీసీసీ అధ్యక్షుడికి కృతజ్ఞతలు

పీసీసీ అధ్యక్షుడికి కృతజ్ఞతలు