చికిత్స పొందుతూ వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

Jun 9 2025 8:08 AM | Updated on Jun 9 2025 8:08 AM

చికిత

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

కందుకూరు: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కందుకూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కడ్తాల్‌ గ్రామానికి చెందిన కడారి శివరాజ్‌(66), గత నెల 27న యాక్టివ వాహనంపై మండల పరిధి కొత్తూరులోని బంధువుల ఇంటికి వచ్చాడు. తిరిగి వెళ్లే క్రమంలో శ్రీశైలం రహదారి కొత్తూరు గేట్‌ వద్ద కందుకూరు వైపు నుంచి వేగంగా వచ్చిన పల్సర్‌ వాహనం అతడిని ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన సదరు వ్యక్తిని.. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాశ విడిచాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

జీడిమెట్ల: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిరన సంఘటన జీడిమెట్ల పీఎస్‌ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సుభాష్‌నగర్‌ పాండుబస్తీకి చెందిన రంగంపేట వినయ్‌(18)కి చిన్నతనంలోనే తండ్రి మృతిచెందాడు. అప్పటి నుంచి అతడి తల్లి మణి వినయ్‌తో పాటు అతని చెల్లిని పోషిస్తోంది. ఇటీవలే ఇంటర్‌ వినయ్‌ మొదటి సంవత్సరం పూర్తి చేసిన అతను తన చదుల ఖర్చు కోసం టీజీఐఐసి కాలనీలోని జేవీసీ పరిశ్రమలో పని చేస్తున్నాడు. అదివారం సాయంత్రం పరిశ్రమలో పరిచయమైన విష్ణు అనే వ్యక్తితో కలిసి ట్యాంక్‌ బండ్‌కు వెళ్లేందుకు సాయిబాబానగర్‌ నుండి స్కూటీపై బయలుదేరాడు. వినయ్‌ స్కూటీ నడుపుతుండగా విష్ణు వెనకాల కూర్చున్నాడు. వీరి బైక్‌ లక్సాయ్‌ పరిశ్రమ వద్దకు చేరుకోగానే అదే సమయంలో సూరారం వైపు వెళ్లేందుకు యూటర్న్‌ ఓ లారీ యూటర్న్‌ తీసుకుంటుంది. అదే రోడ్డులో వస్తున్న వినయ్‌ అదుపు తప్పి లారీ వెనక టైరును ఢీకొట్టడంతో అతను వెనకటైరు కింద పడిపోగా వెనక కూర్చున్న విష్ణు పక్కకు పడిపోయాడు. ఈ ఘటనలో వినయ్‌ తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికిఅక్కడే మృతిచెందాడు. మృతుడి తల్లి మణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు.

విద్యుత్‌ శాఖ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల అరెస్టు

అంబర్‌పేట: గుట్టు చప్పుడు కాకుండా విద్యుత్‌ కేబుల్‌ వైర్లను చోరీ చేసి విక్రయిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు కోనుగోలు చేసిన స్క్రాప్‌ దుకాణ యాజమానిని ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఆదివారం అంబర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బాగ్‌అంబర్‌పేటకు చెందిన నరేందర్‌, వీరు విద్యుత్‌ శాఖలో కాంట్రాక్ట హెల్పర్లుగా పని చేస్తున్నారు. వీరు శనివారం రాత్రి బతుకమ్మకుంటలోని ఓ స్క్రాప్‌ దుకాణంలో విద్యుత్‌ అల్యూమినియం వైర్లు విక్రయించేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడి చేసిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వారిని అదుపుపులోకి తీసుకుని ప్రశ్నించారు. స్క్రాప్‌ దుకాణం నిర్వాహకుడు చంద్రశేఖర్‌కు వైర్లను విక్రయించేందుకు వచ్చినట్లు చెప్పారు. వీరిని అరెస్ట్‌ చేసిన పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం అంబర్‌పేట పోలీసులకు అప్పగించారు. వారి నుంచి రూ.1.50 లక్షలు విలువైన విద్యుత్‌ వైర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మంత్రి వర్గంలో బీసీలకు పెద్దపీట

సుందరయ్య విజ్ఞాన కేంద్రం: కాంగ్రెస్‌ ప్రభుత్వం మంత్రి వర్గంలో బీసీలకు పెద్ద పీట వేసిందని తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్‌ బాలగౌని బాలరాజ్‌గౌడ్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ యెలికట్టే విజయకుమార్‌గౌడ్‌ అన్నారు. 2వ విడత మంత్రి వర్గ విస్తరణలో బీసీ వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి స్థానం కల్పించడం అభినందనీయమన్నారు. ఆదివారం శ్రీహరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ బీసీలకు తగిన ప్రాధాన్యం కల్పించినందుకు పార్టీ అధినేత రాహుల్‌ గాంధీ, జాతీయ అధ్యక్షుడు మలికార్జున్‌ ఖర్గే, సీఎం రేవంత్‌రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్‌ కొత్వాల్‌ పాల్గొన్నారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి 1
1/1

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement