
ఉన్నత విద్యనందించడం అభినందనీయం
నాగోలు: విద్యార్థులకు ఉత్తమ శిక్షణ, విద్యనందిస్తూ వారిని ఉన్నత స్థానాల్లో నిలుపుతున్న రేయాన్ సైనిక్ స్కూల్స్ యాజమాన్యం నిబద్ధతను అభినందించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్జీ అన్నారు. ఆలిండియా సైనిక్ స్కూల్–2025 ఫలితాలలో 6, 9వ తరగతి ప్రవేశ పరీక్షల్లో మొదటి ర్యాంక్, 4వ ర్యాంక్లతో పాటు అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల సక్సెస్ మీట్ను ఆదివారం నాగోలులోని రేయాన్ సైనిక్ స్కూల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయి పరీక్షలలో విజయం సాధించిన హనీశ్రెడ్డి, అమృత్యాదవ్, శ్రీతేజ, సాకేత్, దీక్షత్రాజ్రెడ్డి, అక్షిత్రెడ్డి, అకున్ బాలాజీ, భానుప్రసాద్తో పాటు 260పైగా మార్కులు సాధించిన 45 మందిని సన్మానించారు. అదేవిధంగా 9వ తరగతి ప్రవేశ పరీక్షా ఫలితాల్లో ప్రతిభ చూపిన అశ్వర్థా, ఎన్డీఏకు ఎంపికై న జాన్సన్, రూపేశ్, జయంత్, అభిరామ్, రఘునందన్, ప్రణవ్లను బీజేపీ జాతీయ నాయకులు శేఖర్జీ, స్కూల్ చైర్మన్ జనార్ధన్రెడ్డి, డైరెక్టర్ ఉమాదేవి అభినందించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా జనార్ధన్రెడ్డి మాట్లాడుతూ.. రేయాన్లో శిక్షణ పొందిన విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకున్నారన్నారు. గత 25 సంవత్సరాలుగా ఎందరో విద్యార్థులు వివిధ రంగాల్లో స్థిరపడ్డారని, సివిల్ సర్వెంట్స్గా, ఇంజనీరింగ్, మెడికల్ విభాగాలు, ఎన్డీఏలో అవకాశాలు లభించాయన్నారు. రేయాన్ డైరెక్టర్ ఉమారెడ్డి మాట్లాడుతూ.. చిన్నారులకు విద్యతో పాటు సామాజిక అవగాహన, ఉన్నతమైన విలువలు నేర్పుతున్నామని స్పష్టం చేశారు.